తప్పిన పెనుప్రమాదం
బళ్లారి నగర పాలికె గాంధీనగర ప్రధాన రహదారి దిగువన భూగర్భ మురుగు కాలువ ఒక్కసారి కుంగిపోయింది. 14 అడుగుల గుంత ఏర్పడింది.
కుంగిన గాంధీనగర్ ప్రధాన రహదారి
గాంధీనగర్ ప్రధాన రహదారిలో కుంగిపోయిన రహదారి
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి నగర పాలికె గాంధీనగర ప్రధాన రహదారి దిగువన భూగర్భ మురుగు కాలువ ఒక్కసారి కుంగిపోయింది. 14 అడుగుల గుంత ఏర్పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాలికె అధికారులు శనివారం పనులు ప్రారంభించారు. కనక దుర్గమ్మ గుడి నుంచి గాంధీనగర్ ప్రధాన రహదారి మధ్యలో భూగర్భ మురుగు కాలువ గొట్టాలు వెళ్తున్నాయి. ఈ గొట్టాలను 1973లో వేయడంతో బలహీనపడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఉన్న ఫళంగా ప్రధాన రహదారిలోని రేణుక హోటల్ ముందు గుంత ఏర్పడింది. కుంగిన ప్రదేశంలో వాహనాలు ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పాలికె అధికారులు తెలిపారు.
పనులు ప్రారంభించిన పాలికె అధికారులు
కుంగిపోయిన భూగర్భ మురుగు కాలువ పనులు శనివారం ఉదయం ప్రారంభించారు. నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, కమిషనర్ రుద్రేశ్, ముఖ్య ఇంజినీర్ ఖాజా పరిశీలించారు. పైభాగం నుంచి వస్తున్న మురుగునీటితో పనులకు ఇబ్బంది కలగకుండా దుర్గమ్మ దేవస్థానం మలుపులో గొట్టాలతో మురుగునీటిని రాజ కాలువకు మళ్లించారు. భవిష్యత్తులో భూగర్భ మురుగు కాలువ గొట్టాలు కుంగిపోకుండా ముందు జాగ్రత్తగా రేణుక హోటల్ నుంచి దుర్గమ్మ గుడి వరకు కొత్త గొట్టాలు వేస్తామని పాలికె అధికారులు తెలిపారు.
పనులకు ఇబ్బంది లేకుండా పైభాగంలో మురుగునీటిని రాజు కాలువకు మళ్లింపు
మోక్షం ఎప్పుడో
గాంధీనగర్ ప్రధాన రహదారికి మోక్షం ఎప్పుడు లభిస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి గొట్టాలు వేయడంతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీచే విచారణ చేశారు. దీనిపై పాలికె అధికారులు కేసు ముగించారు. గాంధీనగర్ ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో చేయడానికి అధికారులు సిద్ధమవుతుండగా తాగునీటి గొట్టాలు పగలిపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. తాగునీటి గొట్టాలు సరిపోయాయి. రహదారి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా, శుక్రవారం సాయంత్రం భూగర్భ మురుగు కాలువ కుంగిపోయింది. దీంతో రహదారి పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతోంది.
పనులు పరిశీలిస్తున్న శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, పాలికె అధికారులు
భారీ వాహనాలు నిషేధించాలి
ఈ రహదారిపై భారీ వాహనాలు 40 నుంచి 60 టన్నుల బరువును తీసుకెళ్తుండటంతో గొట్టాలు పగిలిపోతున్నాయి. పగటి పూట భారీ వాహనాలు నగరంలోకి అనుమతించకూడదని జిల్లా పాలనాధికారి పోలీసులకు పలుమార్లు హెచ్చరించినా.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం రహదారి పూర్తి స్థాయి వేసే వరకు భారీ వాహనాలను నిషేధించాలని స్థానిక ప్రజలతో పాటు, పాలికె అధికారులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు