శరావతి పరిహారం మాటేంటి?
శరావతి ఆనకట్ట నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలకు ఇప్పటి వరకు పరిహారాన్ని ఇవ్వలేదని యడియూరప్ప పెదవి విరిచారు.
సమావేశంలో జ్ఞానేంద్ర, యడియూరప్ప, బి.వై.రాఘవేంద్ర
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : శరావతి ఆనకట్ట నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలకు ఇప్పటి వరకు పరిహారాన్ని ఇవ్వలేదని యడియూరప్ప పెదవి విరిచారు. ప్రభుత్వం మంజూరు చేసిన భూమి తమదంటూ అటవీశాఖ కొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చింది. శరావతి వెనుక జలాల (బ్యాక్ వాటర్) కారణంగా భూములు ఖాళీ చేసిన 12 వేల కుటుంబాలకు పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. యడియూరప్ప నేతృత్వంలో లోక్సభ సభ్యుడు బి.వై.రాఘవేంద్ర, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, ఎమ్మెల్యేలు హరతాళు హాలప్ప, అశోక్ నాయక తదితరులు సంబంధిత అధికారులతో గురువారం సమావేశమయ్యారు. శరావతి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు దశాబ్దాల నుంచి పోరాటం కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర అటవీశాఖ మంత్రిని ఇటీవలే సమావేశం కాగా.. వారికి భూములు, పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రత్యామ్నాయాన్ని కోరామని తెలిపారు. నిర్వాసితులకు మొత్తం తొమ్మిది వేల ఎకరాల భూమిని మంజూరు చేయాలని కేంద్రానికి నివేదికను, సిఫార్సులను పంపిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులకు కొత్తగా కేటాయించిన ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్న చోటును గ్రామంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాత అటవీ శాఖ కొత్తగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వాలు విడుదల చేసిన 27 ఆదేశాలలో నిర్వాసితులకు 9,119 ఎకరాలు ఉండగా, సమీక్ష అనంతరం 9,653 ఎకరాలుగా తేలిందన్నారు. వారికి శాశ్వతంగా భూమిని పంపిణీ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. శరావతి నదిపై లింగనమక్కి వద్ద 1959లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. అప్పటి నుంచి బాధితులకు పరిహారం లభించలేదు. కొన్ని గ్రామాలకు విద్యుత్తు సదుపాయాన్ని కల్పించేందుకు హైకోర్టు ఇటీవలే ఆదేశాలూ ఇచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!