అమిత్షాకు ఫిర్యాదు చేస్తా
కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్ సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమయ్యేందుకు మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి సన్నాహాలు చేసుకుంటున్నారు.
రమేశ్ జార్ఖిహొళి
బెళగావి, న్యూస్టుడే : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్ సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమయ్యేందుకు మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ కేసును ఇక్కడికే వదిలి పెట్టాలని ఆయన సోదరుడు బాలచంద్ర జార్ఖిహొళి అభిప్రాయపడటం గమనార్హం. రమేశ్కు వ్యతిరేకంగా న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. రాసలీలల సీడీ బయటకు రావడంతో విధి లేని పరిస్థితులలో జార్ఖిహొళి తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దీని వెనుక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నారనేది జార్ఖిహొళి ఆరోపణ. ఆ ఆరోపణలకు సంబంధించిన దాఖలాలను ముఖ్యమంత్రి బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్రకు ఆయన అందజేశారు. కేంద్ర మంత్రి అమిత్షాను కలిసేందుకు సమయాన్ని కోరిన జార్ఖిహొళి ఇప్పటికే హస్తినకు వెళ్లారు. డీకే శివకుమార్పై ఆధార రహిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే పరువు నష్టం కేసు దాఖలు చేసి, న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంకేత ఏణగి ట్వీట్ చేసి హెచ్చరించారు. ఈ కేసును ఇక్కడితో వదిలి పెట్టాలని బాలచంద్ర జార్ఖిహొళి తన సోదరుడిని కోరారు. ‘సీడీ విషయంలో మూడు కుటుంబాలకు చెడ్డపేరు వచ్చింది. ఈ విషయాన్ని పట్టుకుని ముందుకు వెళితే మరింత వివాదం ముదురుతుంది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడికే వదిలి పెట్టాలి’ అని రమేశ్ను కోరతానని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రితో చర్చిస్తా..
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి రాసలీలల సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయాన్ని తీసుకుంటామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. జయమహల్లోని నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీడీ తయారీ వెనుక కొందరి హస్తం ఉందంటూ మాజీ మంత్రి రమేశ్ ఇప్పటికే తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. సీబీఐ దర్యాప్తుతోనే దాని వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు వెలుగులోకి వస్తాయనేది ఆయన అభిప్రాయమన్నారు. బ్లాక్మెయిల్ చేసేందుకు రహస్య కార్యాచరణ నిర్వహించి సీడీ చేయడం నేరమని జ్ఞానేంద్ర పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.