అవినీతిపరులను కారాగారానికి పంపిస్తాం
పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతిపరులైన రాజకీయ నాయకులను కారాగారానికి పంపిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు.
కుమరస్వామిని సత్కరించేందుకు నమ్మ మెట్రో బోగీల తరహాలో వెండితో తయారు చేసిన గజమాల
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే: పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతిపరులైన రాజకీయ నాయకులను కారాగారానికి పంపిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఒకప్పుడు దోపిడీదారుల దగ్గరే ఎక్కువ డబ్బు ఉండేది. ఇప్పుడు భాజపా నాయకుల ఇళ్లలో సంపద పోగవుతోందని ఎద్దేవా చేశారు. ఆదివారం దాసరహళ్లి నియోజకవర్గంలో ఆయన పంచరత్న యాత్రను నిర్వహించారు. ఇదే నేపథ్యంలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. పలు కార్యక్రమాలను జారీలోకి తీసుకుని రాకుండా మంత్రి అశోక్ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మరో 61 రోజులు పగలూ, రాత్రి నియోజకవర్గాలను చుట్టివస్తానని, పూర్తి మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే సంకల్పానికి ప్రజలు, నేతలు మద్దతు ఇస్తారన్న నమ్మకం వచ్చిందన్నారు. పాలికె పరిధిలోకి 110 గ్రామాలను తీసుకు వచ్చిన ఘనత తనదేనని గుర్తు చేశారు. దాసరహళ్లిలో పనులు చేసేందుకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం అడ్డుపడితే, హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు. నిధులు విడుదల కాకుండా, మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ అడ్డుపడ్డారని ఆరోపించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే నాయకులను దూరం చేసుకుని, కొత్త తరానికి అవకాశాలు ఇస్తున్నామని తెలిపారు. శివరాత్రి రోజు మినహా ఈనెల 27 వరకు వరుసగా బెంగళూరు పరిధిలో పంచరత్న యాత్ర కొనసాగిస్తానని ప్రకటించారు. మార్చిలో హాసన, మైసూరు విభాగాలలో యాత్ర ఉంటుందని, 25వ తేదీ నాటికి ముగింపు సభను నిర్వస్తామని వెల్లడించారు. తమకు పూర్తి మెజారిటీ ఇస్తే 65 ఏళ్లు దాటిన పేదలకు నెలకు రూ.5 వేల పింఛను ఇస్తామని ప్రకటించారు. వివాహం చేసుకోని మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తామని తెలిపారు. ఈసారి మంజునాథ్ను గెలిపించుకుంటే, ఆయనకు మంత్రిగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. నమ్మ మెట్రో బోగీల తరహాలో వెండితో చేసిన హారాన్ని బోన్మిల్లు కార్యకర్తలు కుమారస్వామికి వేసి సత్కరించారు. బాగలగుంటెలో కొందరు కార్యకర్తలు గొర్రెపై కుమారస్వామి అని రాయించి బహుమతిగా ఇచ్చారు. ఎమ్మెల్సీ రవికుమార్ తమ యాత్రను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. విజయసంకల్ప యాత్ర బదులుగా సీడీ యాత్రను నిర్వహించాలని భాజపా నాయకులకు సలహా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు