రెక్కలు కట్టుకుని ఓట్ల వేట
విధానసభ ఎన్నికల ప్రకటన కోసం పార్టీలన్నీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రకటన ఏ క్షణంలోనైనా వెల్లడించే వీలుంది. ఆలోపు కనీసం సగం రాష్ట్రాన్ని చుట్టేయాలి
హెలికాప్టర్ల ధరలకు డిమాండు
నేతల కోసం సిద్ధమవుతున్న హెలిక్యాప్టర్లు
ఈనాడు, బెంగళూరు : విధానసభ ఎన్నికల ప్రకటన కోసం పార్టీలన్నీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రకటన ఏ క్షణంలోనైనా వెల్లడించే వీలుంది. ఆలోపు కనీసం సగం రాష్ట్రాన్ని చుట్టేయాలి. ప్రకటన వచ్చాక మిగిలిన ప్రాంతాల్లో పర్యటించాలి. ఉన్నది కేవలం ఓ నెల సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేతలు హెలికాప్టర్ల వైపు దృష్టి సారించారు. బెంగళూరు నగరం నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతాలకు ప్రయాణమంటే కనీసం 600 కిలోమీటర్ల వరకు సాగాలి. ఈ ప్రయాణ భారం సులభతరం చేయాలంటే హెలికాప్టర్లు ఎక్కాల్సిందే. నెల రోజులుగా రాష్ట్రంలో ఈ విహంగాలకు ఎక్కడ లేని డిమాండు పెరిగిపోయింది.
ర్యాలీల జోరు
కాంగ్రెస్, భాజపా, జనతాదళ్, ఆప్ నేతలు మొత్తంగా కనీసం 600కుపైగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలను తయారు చేసుకున్నారు. పార్టీల అంచనా ప్రకారం భాజపా 200, కాంగ్రెస్ 200, జేడీఎస్ 150, ఆప్ 50 ర్యాలీలు చేపడుతున్నట్లు ఆయా పార్టీల కార్యాలయాలు వెల్లడించాయి. ఈ ర్యాలీల కోసం జాతీయ, రాష్ట్ర నేతలు వస్తుంటారు. జాతీయ నేతలు వారి సొంత హెలికాప్టర్లు, విమానాల ద్వారా ప్రచార ప్రాంతాలకు చేరుకుంటారు. రాష్ట్ర నేతలు ఒక రోజులో మూడు నాలుగు చోట్ల ప్రచారం చేయాలి. వారికి హెలికాప్టర్లు తప్పనిసరి. భాజపా 2018 ఎన్నికల్లో వీటి కోసం రూ.17.2 కోట్లు, కాంగ్రెస్ రూ.10.5 కోట్లను వ్యయం చేయగా, జేడీఎస్ రూ.8 కోట్లు వ్యయం చేసింది. ఈ ఏడాది ఈ ఖర్చు రూ.50 కోట్లు దాటే వీలుందని గోల్డెన్ ఈగల్ ఏవియేషన్ డైరెక్టర్ జె.ఎస్.జార్జ్ తెలిపారు. పెరిగిన ధరలు, ర్యాలలకు అనుగుణంగా ఈ వ్యయం చేయక తప్పదు.
* రాష్ట్ర నేతలు తరచుగా అగ్ని ఏవియేషన్, డక్కన్ ఏవియేషన్, తంబి ఏవియేషన్, ఫ్లై బ్లేడ్ వంటి కంపెనీల హెలికాప్టర్లు వినియోగిస్తారు. వీటికి తోడు చార్టెడ్ ఫ్లైట్లు, 7 ఆసనాల డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లనూ అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. మైసూరు, మంగళూరు, కలబురగి, బెళగావి, హుబ్బళ్లి, బళ్లారి, విజయపుర, రాయచూరు తదితర ప్రాంతాలకు తప్పనిసరిగా వీటినే వినియోగిస్తారు. వాటి ఛార్జీల వివరాలిలా..
* డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ కోసం గంటకు రూ.3 లక్షలు
* డబుల్ ఇంజిన్ ప్రత్యేక విమానం : బెంగళూరు- దిల్లీ- బెంగళూరు వరకు రూ. 20 లక్షలు
* బెంగళూరు-కలబురగి వరకు : రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు..
* బెంగళూరు- హుబ్బళ్లి- బెళగావి, మంగళూరు మార్గంలో : రూ.6.5 లక్షలు.
అప్రమత్తంగా లేకుండా ప్రమాదాల ముప్పు
గిఫ్టుబాక్సులు స్వాధీనం
మండ్య, న్యూస్టుడే : బెంగళూరు నుంచి శృంగేరికి తరలిస్తున్న గిఫ్టు బాక్సులను నాగమంగల సమీపంలోని కదబళ్లి టోల్గేటు వద్ద మంగళవారం స్వాధీనపరుచున్నారు. కుక్కర్లు, బాండ్లీలు, టీ సెట్లు, ఇతర వస్తువులు ఉన్న 1595 గిఫ్టు బాక్సులను జప్తు చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ వస్తువులకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనపరుచుకున్నారు. శృంగేరి ఎమ్మెల్యే వీటిని తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. బండిగనవిలె ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఓటర్లకు పెద్ద ఎర!
బెంగళూరు (యలహంక), న్యూస్టుడే : యలహంక విధానసభ నియోజకవర్గంలో పరిధిలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఓవిద్యా సంస్థలో నిల్వ చేసిన రూ.3.67 కోట్ల విలువ చేసే వస్తువులను కేంద్ర ఆదాయ పన్నుల శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో విద్యాసంస్థ గోదాముపై అధికారులు దాడి చేశారు. కుక్కర్లు, వంట సామగ్రి, తదితర వాటిని స్వాధీనం చేసుకుని యలహంక పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య