పథకాలే శ్రీరామరక్ష
విధానసభకు మే 10న జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు.
అశోక్తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న బొమ్మై
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే: విధానసభకు మే 10న జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. అత్యంత బలమైన క్యాడర్, ఎక్కువ మంది సభ్యులను కలిగిన తమ పార్టీ ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సాధనలను ప్రజలకు తెలియజేసిందన్నారు. బుధవారం మధ్యాహ్నం తన అధికారిక నివాస కార్యాలయం వద్ద మంత్రి ఆర్.అశోక్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బూత్ స్థాయి కార్యక్రమాలు, మోర్చాల సమ్మేళనాలు, విజయ సంకల్ప యాత్ర, సంకల్ప యాత్ర, రథయాత్రలతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించినప్పుడు ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పథకాలే తమకు శ్రీరామరక్ష అని అన్నారు. జనతా జనార్ధనుడు భాజపాకు అండగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష నాయకుల ఆరోపణలు, కుట్రలు, వారు ఇస్తున్న హామీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అవినీతితో పాటు వారు చేస్తున్న ఇతర అన్ని ప్రయత్నాలు వారికి తిరుగుబాణాలయ్యాయని పేర్కొన్నారు. లోకాయుక్తను బలోపేతం చేశామని, అవినీతిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయకంగా ఉన్న ఓటు బ్యాంకు పూర్తిగా ఛిద్రమైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించే వారు తమపై ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాల ప్రచారంతో పార్టీ శ్రేణులలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు. భాజపా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎవరూ వలస వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు. భాజపా ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేస్తున్న విఫల యత్నాలను గుర్తించామన్నారు. వారి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో భాజపా అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణతో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి ఎవరినీ తొలగించే ప్రశ్న లేదన్నారు. కొన్ని వర్గాలను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని దుయ్యబట్టారు. బంజార, బోవి, కొరచ తదితరులను ఎస్సీ జాబితాలోనే ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే తాము కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. తనకు భాజపా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఆఫర్ వచ్చిందని దళపతి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, వారికి ఎవరి నుంచి ఎప్పుడు ఆఫర్లు వస్తాయో, ఆయన వాటిలో దేన్ని స్వీకరిస్తారో అది ఆయన ఒక్కరికే తెలుసని అన్నారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ అగ్రనేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని చెప్పారు. ఏప్రిల్ 9న మైసూరులో నిర్వహించే పులుల సంరక్షణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తారని సీఎం వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలివిడతకు ఎండపోటు
[ 08-05-2024]
కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం. -
పెన్డ్రైవ్ల వెనుక సిద్ధు సర్కారు
[ 08-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. -
ఓటంటేనే వారికి ప్రాణం!
[ 08-05-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్ బూత్ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
[ 08-05-2024]
హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. -
ఓటరు దేవుడు.. మొండికేశాడు
[ 08-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా.. -
ఓటంటేనే ఓ వేడుక!
[ 08-05-2024]
ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు! -
ఆసాంతం.. ప్రశాంతం
[ 08-05-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
అక్క ఇంట్లో చెల్లి చోరీ!
[ 08-05-2024]
సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు. -
తలుపులు వేసుకుని..
[ 08-05-2024]
హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు. -
అడ్డగోలుగా గర్భవిచ్ఛితి
[ 08-05-2024]
పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్