బడుగుల బతుకు ధరాభారం
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
భాజపా పాలన లోపభూయిష్టం
చిత్రదుర్గ సభలో ప్రియాంకగాంధీ
వేదికపై ప్రియాంక గాంధీ, రణదీప్సింగ్ సుర్జేవాల, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నేతలు సుధాకర్, వీరేంద్ర, సలీం అహ్మద్, గోపాలకృష్ణ తదితరులు
చిత్రదుర్గం, న్యూస్టుడే : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం చిత్రదుర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.ఎన్.చంద్రప్పకు మద్దతుగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ధరల నియంత్రణలో భాజపా సర్కారు ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. పేదలు, రైతులు, కార్మికుల జీవనం అగమ్యగోచరంగా మారిందన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని వాపోయారు. ఉద్యోగ సృష్టి విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చతికిలపడ్డారని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలూ మండుతున్నాయని గుర్తుచేశారు. కన్నడనాట కలసా- బండూరి నాలా సాగునీటి పథకం, రాయచూరులో ఎయిమ్స్ శాఖ ఏర్పాటు, చిత్రదుర్గం, దావణగెరె, తుమకూరులో సాగునీటి పథకాలకు కేంద్రం నిధులివ్వడం లేదన్నారు. పన్నుల వాటాలోనూ కోత విధించిందని, కరవు సహాయక నిధులు కరవయ్యాయని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసిందని, ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను అకారణంగా కారాగారాలకు పంపిందని ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తెల్లధనాన్ని సొమ్ము చేసుకుంటున్నట్లు నిందించారు. విదేశాల నుంచి నల్ల ధనాన్ని తెప్పిస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ది పనులు మందగించాయని, ఎన్నికలప్పుడు మాత్రమే కుల, మత, ధర్మం పేరుతో ప్రజల రెచ్చగొట్టడంలో భాజపా ముందుంటుందని నిందించారు. రైతుల రుణాలను మాఫీ చేసే అంశంపైనా మోదీ సర్కారుకు ఆసక్తి లేదన్నారు. కన్నడనాట ఐదు గ్యారంటీ పథకాలు అద్భుతమని కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రి డి.సుధాకర్, దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి టి.బి.జయచంద్ర, ఎమ్మెల్యేలు వీరేంద్ర, గోపాలకృష్ణ, విధానపరిషత్ సభ్యుడు బి.కె.హరిప్రసాద్, నేతలు జయమ్మ, సలీం అహ్మద్, హెచ్.ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.
చిత్రదుర్గ సభకు విచ్చేసిన జనవాహిని..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ‘మహాసంగ్రామం’
[ 06-05-2024]
అభ్యర్థుల తరఫున మలివిడత ప్రచారాన్ని ముగించిన పార్టీలు.. ఇక ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. -
భాజపా నేతలవి పగటికలలు
[ 06-05-2024]
కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి లోక్సభ ఎన్నికలు రెండో స్వాతంత్య్ర పోరాటంతో సమానమని అభివర్ణించారు. -
జనతాదళంలో నిర్వేద పర్వం
[ 06-05-2024]
కీలక నేత హెచ్.డి.రేవణ్ణ అరెస్టుతో జనతాదళ్(ఎస్) శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. ఓ వైపు అగ్రనేత హెచ్.డి.దేవేగౌడను అనారోగ్యం వెన్నాడుతోంది. -
దారితప్పిన కరవు పరిహారం: అశోక్
[ 06-05-2024]
కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది. -
నేతల ప్రచారానికి తాళం..ఓటరు చేతికి పాశుపతాస్త్రం
[ 06-05-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. అసలైన ఘట్టమైన పోలింగ్కు ఓటరు దేవుడు తన పాశుపతాస్త్రంతో సిద్ధమవుతున్నాడు. -
‘జనార్దన్రెడ్డి ఏకవచనంతో మాట్లాడితే ఊరుకోం’
[ 06-05-2024]
గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి తమను ఏకవచనంలో సంబోధించడం మానుకోవాలని మంత్రి శివరాజ్ తంగడిగి హెచ్చరించారు. -
చెంప చెళ్లుమనిపించిన డీకే
[ 06-05-2024]
హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు. -
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపం
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్ ఆదేశాలు జారీ చేశారు. -
డీకేను కించపరచిన ముగ్గురిపై కేసు
[ 06-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కించపరిచేలా వివిధ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులపై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు