తల్లీ పిల్లలకు కొవిడ్ చికిత్స
మూడోదశ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులనూ వదలడం లేదు. జనవరి మొదటివారం నుంచి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భయాందోళనలో ఉన్నవారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు
మూడోదశ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులనూ వదలడం లేదు. జనవరి మొదటివారం నుంచి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భయాందోళనలో ఉన్నవారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం అక్కున చేర్చుకొని మెరుగైన వైద్యసేవలందిస్తోంది. ఇప్పటికే సాధారణ ప్రసవాల ప్రక్రియలో మంచి ప్రతిభను కనబరుస్తున్న ఎంసీహెచ్లో ప్రసూతి, పిల్లల వైద్య నిపుణులు పాజిటివ్ గర్భిణులకు కాన్పులు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.
13 మందికి కాన్పులు
ఎంసీహెచ్లో గత 22 రోజుల్లో 13 మంది గర్భిణులు పాజిటివ్తో బిడ్డలకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్య బృందాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పులు చేశారు. ప్రసవానంతరం ప్రత్యేక వార్డులో ఉంచి ఇన్పేషంట్ సేవలందిస్తున్నారు. ఇక్కడ పుట్టిన పిల్లల్లో ఒక్కరికి కూడా పాజిటివ్ లేదని వైద్యాధికారులు చెప్పారు. తల్లులకు లక్షణాలు ఉండటంతో వారం శిశువులను దూరంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతర ఆస్పత్రుల్లో జన్మించి కరోనాతో వచ్చిన ఆరుగురు చిన్నారులు ఇక్కడ చికిత్స పొందారు. ప్రస్తుతం సత్తుపల్లి, ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి పాజిటివ్తో ఇద్దరు నవజాత శిశువులు రాగా ప్రత్యేక విభాగంలో వారికి వైద్యం చేస్తున్నారు.
43 మంది గర్భిణులకు పాజిటివ్
కరోనా సోకిన తల్లీ పిల్లల కోసం ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. సాధారణ ఆస్పత్రి, ఎంసీహెచ్లో మొత్తం 80 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఓపీ విభాగానికి వస్తున్న గర్భిణుల్లో పలువురు పాజిటివ్గా తేలుతున్నారు. బాధితుల్లో వైరస్ తీవ్రతను గుర్తించి ఇన్పేషంట్గా చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ ఉందని తేలిన వారికి ఔషధ కిట్లు ఇస్తూ ఇంటి వద్ద ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో మొత్తం 43 మంది గర్భిణులు పాజిటివ్గా తేలారు.
ధైర్యంగా వైద్యసేవలు పొందవచ్చు
- బి.వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు
జిల్లా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్తో వచ్చిన గర్భిణులు, బాలింతలు, పిల్లలకు చికిత్సలు అందిస్తున్నాం. కాన్పులు కూడా చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాం. తప్పనిసరైతేనే హైదరాబాద్, వరంగల్కు రిఫర్ చేస్తాం. ఇప్పటివరకు ఆ అవసరం రాలేదు. బాధితులు ధైర్యంగా చికిత్స పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.