రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయం వేలం పాటకు త్వరలోనే నోటిఫికేషన్
ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే దీనికి టెండర్లు పిలిచి వేలం పాటలో ఇళ్ల సముదాయాన్ని విక్రయించేందుకు
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే
2021 నవంబరు 28న ప్రచురితమైన కథనం
ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే దీనికి టెండర్లు పిలిచి వేలం పాటలో ఇళ్ల సముదాయాన్ని విక్రయించేందుకు కసరత్తు చేస్తున్నారు’ అంటూ 2021 నవంబరు 28వ తేదీన ‘ఈనాడు’ పత్రికలో కథనం ప్రచురితమైంది.
అదే నిజమైంది. సరిగ్గా రెండు నెలలు అంటే బుధవారం(26 జనవరి 2022) కలెక్టర్ వీపీ గౌతమ్ రాజీవ్స్వగృహ ఇళ్ల సముదాయాన్ని సందర్శించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి వేలం పద్ధతిలో ఇళ్ల సముదాయాన్ని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వయంగా ప్రకటించారు.
నిర్మాణం ఇలా: 2008లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారం చేయడానికి సిద్ధపడి ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి వారి సొంతింటి కళను నెరవేర్చేందుకు రాజీవ్స్వగృహ పథకాన్ని తీసుకొచ్చారు. ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మాణం చేపట్టారు. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభించి సుమారు రూ.72 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 8 బ్లాకులు, ఒక్కో బ్లాక్లో 9 ఫ్లోరులు, ఒక్కో ఫ్లోర్కు 8 ఇళ్లు మొత్తం 576 ఇళ్లు నిర్మించారు. వాటిలో రెండు పడక గదుల ఇళ్లు 288 ఒక్కో ఇంటి విస్తీర్ణం 1,145 చదరపు అడుగులు, మూడు పడక గదుల ఇళ్లు 288 ఉన్నాయి. ఒక్కో ఇంటి విస్తీర్ణం 1,435 చదరపు అడుగులు ఉంది.
ఉద్యోగులకు నిరాశే: 2018లో ఉద్యోగ సంఘాల నేతలు, మరికొందరితో కలిసి రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య చర్చలు సఫలం కాలేదు.
వచ్చే ఆదాయం(సుమారుగా..)
2008లోనే 576 ఇళ్ల నిర్మాణానికి రూ.72 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రెండు పడకగదుల ఇల్లు ఒక్కోటి సరాసరి రూ.30 లక్షలు ఉంటుంది. ఇలా 288 ఇళ్లకు రూ.86.40 కోట్లు, మూడు పడక గదుల ఇల్లు అయితే దాదాపుగా రూ.35 లక్షలు ఉంటుంది. అలా 288 ఇళ్లకు రూ.100.80 కోట్లు వచ్చే వీలుంది. మొత్తం భూమి 16.23 ఎకరాలలో మొదటి ఫేజ్లో భాగంగా 9.23 ఎకరాలలో ఇళ్లు నిర్మించారు. రెండో ఫేజ్ నిర్మాణానికి 7 ఎకరాలు కేటాయించారు. ఖాళీగా ఉన్న ఈ 7 ఎకరాల స్థలం గుర్తించి హద్దులు కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ ధర ఎకరానికి రూ.2 కోట్లు. ఈ లెక్కన రూ.14 కోట్ల వచ్చే వీలుంది. ఇలా మొత్తం సుమారుగా ఆదాయం రూ.201.20 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే అవకాశం నెలకొంది. కానీ ప్రభుత్వం, అధికారులు ఏ ధరకు ఇళ్లను, భూమిని కట్టబెడతారో వేచి చూడాలి.
ఇళ్ల సముదాయం విక్రయం
కలెక్టర్ గౌతమ్
ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్ పక్కన కమిషనర్ ఆదర్శ్ సురభి
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: జలజ టౌన్షిప్(రాజీవ్స్వగృహ) ఇళ్ల సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించటానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పోలేపల్లి పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టిన రాజీవ్స్వగృహ ఇళ్ల సముదాయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్తో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 576 ఇళ్ల సముదాయాలను వేలం పద్ధతిన విక్రయించటానికి నిర్ణయించినట్లు తెలిపారు. సంబంధిత సమాచారం ఎంఎస్టీసీ వైబ్సైట్లో పొందుపర్చామని, ఈ-వేలం పద్ధతిన పూర్తి పారదర్శకంగా విక్రయ ప్రక్రియ జరుగుతుందన్నారు. వివరాలకు కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్డెస్క్, రాజీవ్స్వగృహ ఇళ్ల సముదాయంలో ప్రత్యేక కార్యాలయం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.