ఆదుకునేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు
బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని భార్యతో కలిసి వెళ్తున్న ఆ ఉద్యోగి గమ్యస్థానం చేరకుండానే అనంత లోకాలకు చేరారు. ఖమ్మం మిషన్ భగీరథ ఇంట్రా విభాగం డివిజన్ కార్యాలయంలో సహాయ టెక్నికల్ అధికారిగా
సారయ్య, సుజాత (పాత చిత్రం)
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్టుడే: బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని భార్యతో కలిసి వెళ్తున్న ఆ ఉద్యోగి గమ్యస్థానం చేరకుండానే అనంత లోకాలకు చేరారు. ఖమ్మం మిషన్ భగీరథ ఇంట్రా విభాగం డివిజన్ కార్యాలయంలో సహాయ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్న తాడూరి సారయ్య (55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ శాఖలో తీవ్ర విషాదం అలుముకుంది. భార్య సుజాతతో కలసి ఆదివారం ఉదయం సొంత కారులో హుజూరాబాద్ వెళుతూ వరంగల్ హంటర్ రోడ్లోని ఆర్వోబీ పైనుంచి ప్రమాదవశాత్తు కారు కింద పడిపోవటంతో దంపతులు దుర్మరణం చెందారు. శనివారం రాత్రి 8 గంటల వరకు కార్యాలయంలో తమతో కలిసి పనిచేసిన వ్యక్తి మృతిని సహచర ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. తన బాల్య స్నేహితుడు ఒకరు ఇటీవల మరణించారని, అతని కుటుంబానికి సాయం అందించాలని రూ.1.70 లక్షలు సేకరించారని, దశదిన కర్మకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సహచర ఉద్యోగి ఉప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటేషన్పై ఖమ్మంలోనే..
సారయ్య కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామవాసి. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో ఏటీవోగా కల్లూరులో నాలుగు సంవత్సరాలు, ఖమ్మంలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల స్థానికత, నూతన జోనల్ విధానం అమల్లో భాగంగా ఆయన ఆర్నెల్ల క్రితం జనగామ జిల్లాకు బదిలీ అయ్యారు. తర్వాత డిప్యూటేషన్పై ఖమ్మంలోనే పనిచేస్తున్నారు.
కుమారుడూ రోడ్డుకే బలయ్యాడు..: సారయ్య, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు విజయ్కుమార్ 2020 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమార్తె విద్యారాణికి జనవరిలో ఖమ్మంలో వివాహం చేశారు. పెద్ద కుమారుడు వినయ్కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల మరణవార్త తెలియగానే వరంగల్ చేరుకున్న అతను తల్లడిల్లిపోయాడు. ఎంజీఎం ఆసుపత్రిలో సారయ్య, సుజాత భౌతిక కాయాలకు శవపరీక్ష నిర్వహించి కుమారుడికి అప్పగించారు. అంత్యక్రియలు సోమవారం తమ స్వగ్రామంలో నిర్వహిస్తున్నట్లు వినయ్కుమార్ ‘న్యూస్టుడే’కు తెలిపారు. సహచర ఉద్యోగులు సారయ్య దంపతుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్