మోదీ సభ విజయవంతం చేయాలి
ప్రధాని నరేంద్ర మోదీ జులై 3న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పాల్గొని ప్రసంగించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గోపాలకృష్ణ అగర్వాల్, రమేశ్, సత్యనారాయణ, విద్యాసాగర్, శారద, ప్రదీప్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రధాని నరేంద్ర మోదీ జులై 3న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పాల్గొని ప్రసంగించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గలోని పోలింగ్ బూత్ కమటీలు, శక్తి కేంద్రాల ప్రతినిధులతో గురువారం ఖమ్మంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో బహిరంగ సభకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రధాని మోదీ సందేశాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. సమావేశంలో రమేశ్, దొంగల సత్యనారాయణ, గెంటేల విద్యాసాగర్, రుద్ర ప్రదీప్, శారద పాల్గొన్నారు.
రఘునాథపాలెం, న్యూస్టుడే: గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ పిలుపునిచ్చారు. రేగులచలకలో కిసాన్మోర్చా- ఓబీసీ మోర్చా ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం గురువారం రాత్రి జరిగింది. సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడారు. హైదరాబాదులో జరిగే సభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ కనకంచి రమేశ్, ఉప్పల శారద, రుద్రప్రదీప్, కిరణ్, వీరుగౌడ్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, నరేశ్, బాబూచారి, సరస్వతి, రవి పాల్గొన్నారు.
కామేపల్లి, న్యూస్టుడే: భాజపా గెలుపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి శ్రీలతా ఉసెండి అన్నారు. రామకృష్ణాపురంలో భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు జర్పుల రామారావు అధ్యక్షతన జరిగింది. హైదరాబాద్లో జరిగే భాజపా సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్రెడ్డి, గోపికృష్ణ, శ్రీనునాయక్, రంగారావు, రామచంద్రయ్య పాల్గొన్నారు.
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంత్ బాజ్పాయి అన్నారు. పెద్దతండాలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని భాజపా మండల కమిటీల సమావేశం గురువారం నిర్వహించారు. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, నాయకులు నరేంద్రరావు, నున్న రవి, శ్రీనివాసరెడ్డి, సంతోష్రెడ్డి, కిరణ్, కోటయ్య, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు. రెడ్డిపల్లిలో పద్మశ్రీ వనజీవి ఇంటికి బాజ్పాయి వెళ్లి రామయ్య, జానమ్మ దంపతులను సన్మానించారు.
నేలకొండపల్లి, న్యూస్టుడే: నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లో లక్ష్మీకాంత్ పర్యటించారు. బోదులబండలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్గౌడ్ తండ్రి బాలకృష్ణ ఇటీవల మరణించగా పరామర్శించారు. బాలకృష్ణ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!