logo

60 ఏళ్ల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు: డీసీసీ

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ అన్నారు.

Published : 03 Jun 2023 03:32 IST

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఆమెకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పీసీసీ సభ్యులు ఎండీ జావీద్‌, రాయల నాగేశ్వరరావు, వీరభద్రం, నాయకులు కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్‌గౌడ్‌, హుస్సేన్‌, వీరారెడ్డి, దేవేంద్రం, చోటాబాబా, అబ్బాస్‌, స్వరూప, పుష్ప, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, సైదులు నాయక్‌, మలీదు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని