Revanth Reddy: ముఖ్యమంత్రి.. ముత్యాల తలంబ్రాలు తెచ్చేనా..?
భద్రాచలం శ్రీసీతారామచంద్రసామి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రసామి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రచార గోడపత్రికలను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను ఆలయాధికారులు అందిస్తున్నారు. స్వాగత ద్వారాలు ఏర్పాటుచేయనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి అధికారికంగా ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకురావటం ఆనవాయితీ. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకలకు వస్తానని ఇటీవల భద్రాచలం పర్యటన సందర్భంగా వెల్లడించారు. అయితే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. కోడ్ అమల్లోకి వస్తే ప్రజాప్రతినిధులకు ఆలయాల్లో ప్రొటోకాల్ వర్తించదు. ఈ పరిస్థితుల్లో సీఎం వస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.
ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని..
భద్రాచలం రాములవారికి పాలకులు ముత్యాల తలంబ్రాలు తీసుకురావటమనేది శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తలంబ్రాలను తీసుకొచ్చే అవకాశం సీఎంకు కల్పించాలని లేఖ ద్వారా కోరనున్నారు. ఆలయాన్ని నిర్మించిన భక్తరామదాసు కాలంలో చోటుచేసుకున్న ఘటనల సారాంశాన్ని పొందుపర్చి, తానీషా ప్రభువు స్వయంగా తలంబ్రాలను తీసుకొచ్చిన చరిత్రను లేఖలో వివరించనున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టతకు ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. అనివార్య కారణాలతో ముఖ్యమంత్రి రాకపోతే దేవాదాయశాఖ కమిషనర్తో పాటు ముఖ్యమైన అధికారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించే వీలుంది. పట్టాభిషేకానికి గవర్నర్ రావటం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు వేడుకలకు సంబంధించిన సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?