చూచువారలకు చూడ ముచ్చట..
కల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు.
సీతారాముల కల్యాణోత్సవంతో మురిసిన ముల్లోకాలు
భద్రాచలం, న్యూస్టుడే
కల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతి మదినీ పునీతం చేసింది. జగదేకవీరుడైన రామయ్యకు జగన్మాత సీతమ్మకు నిర్వహించిన కల్యాణంతో భూలోకమంతా పండుగైంది. భక్తులు బ్రహ్మానందభరితులయ్యారు. అందరినీ దరిచేర్చే మా రాజువు నీవేనంటూ దేవనాథ రామానుజ జీయర్స్వామి చేసిన ప్రవచనం ఓలలాడించింది. భద్రాచలం రామాలయ ప్రాంగణంలోని మిథిలా మండపంలో బుధవారం నిర్వహించిన సీతారాముల శ్రీరామనవమి కల్యాణం కమనీయమైంది.
జయజయ నీరాజనాల మధ్య ఊరేగింపు
తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే శ్రీరామ నామాలు మార్మోగాయి. కౌసల్య సుపుత్రుడికి సుప్రభాతం పలికి ఆరాధించి ఆ తర్వాత మూలవరులకు అభిషేకం చేశారు. సంప్రదాయ బద్ధంగా ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. కల్యాణమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి జయజయ నీరాజనాల మధ్య మాడవీధిలో ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకొచ్చారు.
అభిజిత్ లగ్నంలో..
మంగళసూత్రం చూపుతున్న వేదపండితుడు
మిథిలా మండపానికి ఉదయం 10.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా కాస్త ముందుగా స్వామివారు రావటంతో భక్తులు మురిసిపోయారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా విశ్వమంతా వీక్షిస్తుండగా క్రతువులోని ఒక్కో ఘట్టాన్ని స్థానాచార్యులు స్థలసాయి వివరించారు. విష్వక్సేనుల వారిని అర్చకులు ఆరాధన, పుణ్యాహ వాచనం చేసి పుండరీకాక్ష మంత్రం పఠించారు. సీతారాముల కన్నబిడ్డలం మనమంతా.. జగదానందకారకుడి జగమంత కుటుంబం మనం.. అంటూ సుభాషించారు. ఆ మూర్తులకు శరణాగతులం కావటమే ఆత్మ నివేదనగా అభివర్ణించారు. ఇలాంటి గొప్ప కల్యాణం వీక్షించటం వరం అని తెలిపారు. కన్యావరుణ చేసి సీతమ్మకు యోక్త్రధారణ, రాముడికి యజ్ఞోపవీత ధారణ అనంతరం ప్రవరను పఠించారు. గోత్ర నామాల విశిష్టతను వివరించారు. అభిజత్ లగ్నంలో సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. మాంగళ్య ధారణ చేశారు. వాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మూడో మంగళ పతకం ఈ కల్యాణంలో ప్రత్యేకతను చాటింది.
తలంబ్రాల వేడుక
తిరువీధి సేవలో అడుగడుగునా హారతులు
ముత్యాల హారం ప్రదర్శన
ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అక్షత. వీటిని వాడుక భాషలో అక్షింతలు అని అంటుంటారు. ఈ తలంబ్రాల వేడుక నయనానందకరంగా సాగింది. ముత్యాలతో కలిపి ఉన్న తలంబ్రాలు స్వామివారి మీద పడగానే ప్రాంగణంలో ఉన్నవారంతా పెద్ద పెట్టున జైశ్రీరాం అంటూ తమ సంతోషాన్ని చాటారు. ఈ తలంబ్రాలను ఎలాగైనా తీసుకోవాలన్న తహతహ భక్తుల్లో కనిపించింది. కల్యాణం తర్వాత స్వామివారు దేవాలయానికి చేరుకున్నాక రాజభోగం చేసి ఆరాధించారు. తిరువీధి సేవలో నూతన దంపతులకు అడుగడుగునా హారతులు అందించారు. ఈ జంట చూచువారలకు చూడ ముచ్చటైంది. ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, ఉప ప్రధానార్చకులు ఎ.మురళీకృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు, రామస్వరూప్, వేదపండితులు, వైదిక బృందం క్రతవు నిర్వహించగా ఉత్సవ ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.
మిగిలిన టికెట్లు..
కల్యాణ మండపంలో గతంతో పోల్చితే రద్దీ తగ్గింది. టికెట్లు దాదాపు 40 శాతం మిగిలినట్లు అంచనా. ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. వసతి లభిస్తుందో లేదోనన్న భక్తుల సందేహాన్ని నివృత్తి చేయలేదు. ఎన్నికల హడావుడి మొదలుకావటంతో నాయకులు, వారి అనుచరులు ఆశించిన మేర రాలేదు. మంత్రులు వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వారితో పెద్దగా శ్రేణులు తరలిరాలేదు. అన్నింటికీ మించి ఉత్సవాలపై అధికారులు సరైన ప్రచారం చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కల్యాణం విజయవంతం కావటం సంతోషం: శాంతికుమారి, సీఎస్
కల్యాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించటం సంతోషకరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్రాజును అభినందించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ, విదేశాలకు చెందిన భక్తులు రామ కల్యాణం వీక్షించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పట్టాభిషేకం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.
ఘనంగా తిరువీధి సేవ
భద్రాచలం, న్యూస్టుడే: శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి తిరువీధి సేవ ఘనంగా సాగింది. స్వామివారు చంద్రప్రభ వాహనంపై వేంచేసి ప్రధాన కోవెల నుంచి రాజవీధిలో విహరించారు. భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుని హారతులు అందించారు. మరోవైపు ఆలయంలో శ్రీరామ పునర్వసు దీక్షల స్వీకరణ ఘట్టం అట్టహాసంగా మొదలైంది. పసుపు వర్ణ వస్త్రాలను ధరించిన భక్తులకు రామ మాలలు మెడలో వేసి దీక్షల నియమాలను ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్ వివరించారు. మే 13న దీక్షల విరమణ ఉంటుంది. ఆ రోజు రథోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీలలితా విష్ణు సహస్రనామ పుస్తకావిష్కరణ
భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: భద్రాచలం హరిత హోటల్లో శ్రీలలితా విష్ణు సహస్రనామ స్తోత్రాల పుస్తకాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ హరినాథ్, జస్టిస్ శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం న్యాయమూర్తి భానుమతి, భద్రాచలం న్యాయమూర్తి సూరిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఎలైట్ ట్రస్ట్ నిర్వాహకుడు సునీల్ ఆధ్వర్యంలో ముసునూరి శ్రీలక్ష్మి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ పొట్లాలు, పెరుగు అన్నం పంపిణీ కార్యక్రమానికి జస్టిస్ హరినాథ్ హాజరయ్యారు. న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, అబ్బినేని శ్రీనివాసరావు, కొడాలి చంటి తదితరులు పాల్గొన్నారు.
చంద్రప్రభ వాహనం మోస్తున్న ఈఓ రమాదేవి, పక్కన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు
ఐజీ రంగనాథ్ దంపతులు
ఎస్పీ రోహిత్రాజు
ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థినికి సన్మానం
[ 01-05-2024]
ముచ్చర్లకు చెందిన దేవండ్ల సీతారాములు-ధనలక్ష్మీ దంపతుల కుమార్తె భవ్య పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. -
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
మండలంలోని కారేపల్లి, మాదారంతో పాటు పలు గ్రామాల్లో మేడే వేడుకలు నిర్వహించారు. -
పదిలోనూ బాలికలదే హవా
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా గతంకంటే కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాల మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 12,294 మంది పరీక్షలు రాశారు. -
వార్షిక మరమ్మతుల ప్రణాళికపై సమీక్ష
[ 01-05-2024]
పాల్వంచ కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్ బి.లక్ష్మయ్య మంగళవారం సందర్శించారు. కేటీపీఎస్లోని బాయిలర్, యాష్ ప్లాంట్, యూసీబీ, కోల్ మిల్, టర్బైన్ తదితర విభాగాలను పరిశీలించి.. అక్కడి వివరాలు ఏరియా ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. -
పది ఫలితాల్లో వెనుకంజ
[ 01-05-2024]
పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా గతేడాదితో పోల్చిచూస్తే వెనుకంజ వేసింది. 92.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది మూడు అడుగులు కిందకు దిగజారింది. -
ఖమ్మం కాంగ్రెస్కు కంచుకోట: భట్టి
[ 01-05-2024]
కాంగ్రెస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట లాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. అనేక మంది 10 జీపీఏ సాధించారు. -
తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ: తుమ్మల
[ 01-05-2024]
తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖామంతి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
సంక్షేమం పేరుతో అప్పులమయం
[ 01-05-2024]
పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
నయనానందకరంగా సీతారామ కల్యాణం
[ 01-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన సాగింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసాను పఠించారు. -
సింగరేణిలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి
[ 01-05-2024]
ప్రస్తుత వార్షిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరిగింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు 92 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి.
తాజా వార్తలు (Latest News)
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్