ఇక లెక్కలే.. మిగిలాయి..!
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు.
శ్రీరామనవమి ఆదాయంపై ఆశలు
భద్రాచలం రామాలయం
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. ఉత్సవాలకు అన్ని విధాలుగా రూ.3 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. అంతకు మించి రాబడి రావాల్సి ఉంది. ఎన్నికల హడావుడి, విపరీతమైన ఎండలు, ప్రచార లోపంతో శ్రీరామ నవమి, పట్టాభిషేకం టికెట్ల విక్రయం తగ్గింది. 2.50 లక్షల లడ్డూలను తయారుచేయగా సుమారు 40 వేల లడ్డూలు మిగిలాయి. ఇప్పుడు రద్దీ ఉండడంతో వీటిని ఈ రెండు రోజుల్లో విక్రయించే వీలుంది.
హుండీలపైనే ఆశలు..
కల్యాణం నిర్వహించిన మిథిలా మండపంలో రద్దీ తగ్గినా 17న దాదాపు 30 వేల మంది భక్తులు మూలవిరాట్ను దర్శించుకున్నారు. ఆ రోజున టికెట్లు లేకుండానే అందరకీ ఉచిత దర్శనాలు కల్పించారు. టిక్కెట్లు లేకుండా ప్రవేశం కల్పించడంతో హుండీలో కానుకలు బాగానే వస్తాయని ఆశిస్తున్నారు. 250 క్వింటాళ్ల బియ్యం, 500 కిలోల ముత్యాలతో తలంబ్రాలను తయారు చేశారు. ఇందులో ఒక ముత్యం గల తలంబ్రాల ప్యాకెట్ను రామాలయం కౌంటర్లో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. పోస్టల్ ద్వారా 2 ముత్యాలు గల పొట్లాన్ని రూ.30కి అమ్ముతున్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా రెండు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ను రూ.30కి విక్రయిస్తారా లేక దీన్ని రూ.50 చేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కోరుకున్న భక్తులందరికీ తలంబ్రాలను ఇంటికి చేర్చే పని చురుగ్గా సాగుతోంది.
ఇవీ తేలాలి..
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్వామివారి బంగారం, వెండి ఆభరణాల లెక్కలను తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఒక వెండి ఇటుక మాయమైనట్లు ప్రచారమైంది. ఇది ఏమైందో అతీగతీ లేదు. విరాళాల సేకరణలో వచ్చిన అపవాదులను తొలగించాలి. జానకీ సదనాన్ని ప్రారంభించినప్పటికీ ఇంకా ఇందులో ఫర్నీచర్ను ఏర్పాటు చేయలేదు. రంగనాయకుల గుట్టపై కొత్తగా ఓ కాటేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ దీన్ని ప్రారంభించలేదు. వీటిని ఉపయోగంలోకి తేవాలి. అభివృద్ధి పనులకు సర్వేలు జరుగుతున్నందున శంకుస్థాపన చేసేవరకు ప్రత్యేక చొరవ అవసరం. అభివృద్ధి అంశంలో అలసత్వానికి తావివ్వకుండా చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా, మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
[ 02-05-2024]
సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కూతురు ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!
[ 02-05-2024]
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
భగభగలు
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
పోలింగ్ సమయంలో అప్రమత్తత అవసరం: కలెక్టర్
[ 02-05-2024]
పోలింగ్ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి
[ 02-05-2024]
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు -
ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా
[ 02-05-2024]
గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
అభ్యర్థుల్లో వాటా 3 శాతమే
[ 02-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. -
మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
రాములోరికి ఘనంగా తిరుమంజనం
[ 02-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు -
స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి: ఎస్పీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్