ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
ఈనెల 5న ఆదోనికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పర్యటన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి
విమానాశ్రయం సిబ్బందితో వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్
ఆదోని విద్య, న్యూస్టుడే: ఈనెల 5న ఆదోనికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పర్యటన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి పాఠశాలకు వచ్చే రహదారి వరకు ఇరువైపులా బారికేడ్లు కడుతున్నారు. పాఠశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుండడంతో మైదానంలో ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. పకడ్భందిగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: పట్టణంలో ఈ నెల 5న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో జరగనున్న విద్యా కానుకలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతుండడంతో పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో, మైదానంలో భద్రత ఏర్పాట్లపై ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్కుమార్తో చర్చించారు.
విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన
ఓర్వకల్లు, న్యూస్టుడే: ఓర్వకల్లు విమానాశ్రయంలో శనివారం జిల్లా ఎస్సీ సిద్ధార్థ కౌశల్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెల 5న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. విమానాశ్రయంలో ప్రవేశ, నిష్క్రమణల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనాథరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ పవన్కిషోర్, ఎస్సై మల్లికార్జున ఉన్నారు.
సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంద్రీ తూము ఏర్పాటు చేస్తాం
[ 07-05-2024]
కూటమి అధికారంలో రాగానే హంద్రీ కాలువపై తూము ఏర్పాటు చేసి ఏబీసీ కాలువను అభివృద్ధి చేస్తామని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు మల్లికార్జున గౌడ్ అన్నారు. -
కబ్జాల కాటసాని కథ తేల్చుదాం
[ 07-05-2024]
గజ్జల కొండలో రూ.కోట్ల విలువైన గ్రావెల్ను తవ్వేశారు.. వక్ఫ్ భూములు కబ్జా చేశారు.. జగన్నాథగట్టు భూములు కొల్లగొట్టారు.. పాత్రికేయుల భూములు కబ్జా చేశారు.. కబ్జాల రెడ్డి.. కాటసాని కథ తేల్చుదామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాణికేశ్వరస్వామి భూములు ఆక్రమించారని, నకలీ పత్రాలు సృష్టించారని దుయ్యబట్టారు. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు సమాధి
[ 07-05-2024]
కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు జలసఆది
[ 07-05-2024]
కలుషిత జలం పురవాలసులను కలవరపెడుతోంది. తాగునీటి పైపులైన్లు ఏకంగా మురుగు కాలువల్లోనే ఉండటంతో తాగునీటిలో మురుగు కలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. -
‘స్మార్ట్’గా జగన్ బురిడీ
[ 07-05-2024]
మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.! -
రానున్నది చంద్రన్న రాజ్యం: తిక్కారెడ్డి
[ 07-05-2024]
రానున్నది చంద్రన్న రాజ్యమని కర్నూలు జిల్లా తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తిలక్నగర్, చెన్నకేశవకాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి ప్రచారం చేశారు. -
మాదిగలను మోసం చేసిన వైకాపాకు బుద్ధి చెప్పాలి: మంద కృష్ణ మాదిగ
[ 07-05-2024]
రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నిర్వహిస్తున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
8 వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన