అనువైన స్థలం ఎక్కడో బీసీ చూపించాలి
బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల విషయంలో తాను మోసం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఆరోపించడం మంచిది కాదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..
- ఎమ్మెల్యే కాటసాని
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని
బనగానపల్లి, న్యూస్టుడే: బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల విషయంలో తాను మోసం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఆరోపించడం మంచిది కాదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అనువైన స్థలం ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీసీ చెబుతున్నారని, అనువైన స్థలం ఎక్కడుందో ఆయన తెలుపాలన్నారు. పట్టణంలో 111 ఎకరాల భూమిని గుర్తించి పేదలకు పంచాలని నిర్ణయం తీసుకుంటే ఆయన కోర్టుకు వెళ్లి నిలుపుదల చేశారన్నారు. తాను పేదలకు ఇచ్చే 111 ఎకరాల్లో సర్వే నంబరు 318, 319లో ఎస్సార్బీసీ కాలనీలోని 26 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమి పేదలకు అనువుగా ఉంటుందో లేదో చూడాలని హితవు పలికారు. ఆయన అనుచరులతో కోర్టులో వేయించిన భూమిలో ఈ 26 ఎకరాల భూమి కూడా ఉందన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు లోతట్టు ప్రాంతాలని చెప్పి కోర్టులో వేశారని, ఇప్పుడు తాను చెప్పే స్థలం లోతట్టులో లేదన్నారు. ఇప్పటికైనా అనువైన స్థలం ఆయనే పరిశీలించి పేదలకు ఇవ్వడానికి వీలుంటే వెంటనే కోర్టు నుంచి కేసు ఉపసంహరించుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలను పక్కనబెట్టి మిగిలిన వాటిని పేదలకు ఇచ్చేందుకు సహకరించాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థలం ఉన్నందునే ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. నియోజకవర్గంలో 11,866 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో బనగానపల్లి పట్టణంలో 3,349 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారన్నారు. 2013లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 3,386 మందికి పట్టణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ పట్టాలు గడువు తీరిపోవడంతోనే కొత్తవారికి ఇచ్చేందుకు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండేళ్లు దాటితే ఇళ్లు కట్టుకోలేకపోతే పట్టా రద్దు చేసి ఇతరులకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని బీసీకి తెలియదా అని ప్రశ్నించారు. పేదలకు అన్యాయం చేయకుండా కోర్టు నుంచి కేసు వాపసు తీసుకోవాలని సూచించారు. తాను ఎంపిక చేసిన స్థలం మొత్తం తహసీల్దార్, అధికారులు, పత్రికా విలేకర్లు కలిసి పర్యటించి అనువైన స్థలం గుర్తించి తనకు చెబితే వాటినే ఇళ్ల పట్టాలుగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జిల్లెల శంకర్రెడ్డి, అబ్దుల్ఫైజ్, తిమ్మాపురం సురేష్రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.