నేర వార్తలు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురానికి చెందిన ముక్తాపురం నవీన్కుమార్(23) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
వైద్యవిద్యార్థి బలవన్మరణం
నవీన్కుమార్ (పాత చిత్రం)
ధర్మవరం, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురానికి చెందిన ముక్తాపురం నవీన్కుమార్(23) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, ధర్మవరం 2వ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. చేనేత కార్మికులైన రామాంజనేయులు, రాజమ్మలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు నవీన్కుమార్ కర్నూలులో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. బుధవారం తెల్లవారుఝామున ఇంటి బయట షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రాజమ్మ, రామాంజనేయులు బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా ఒక్కడే కుమారుడు. మొదటి ఏడాది పరీక్షల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. కుటుంబ సభ్యులకు తెలపకుండా మనోవేదన చెందుతుండేవాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాలని పెద్దనాన్న కుమారుడు కార్తిక్కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తండ్రికి విషయం తెలిసేటప్పటికే నవీన్కుమార్ ఉరేసుకొని మృతి చెందాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బండ రాయి మీద పడి వ్యక్తి మృతి
ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్టుడే: ఆళ్లగడ్డ మండలంలోని పాతకందుకూరు గ్రామానికి చెందిన సి.సుబ్బరాయుడు (52) బండ రాయి మీద పడడంతో మృతి చెందారు. ఏఎస్సై సురేష్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి మూత్ర విసర్జనకు వచ్చిన సుబ్బరాయుడు 7 అడుగుల ఎత్తున్న బండ రాయిని పట్టుకుని మూత్ర విసర్జన చేస్తుండగా బండ రాయి విరిగి అతడిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం వేకువజామున బంధువులు అతడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
అంబులెన్సు రాక అల్లాడిన వృద్ధుడు
డోన్ పట్టణం, న్యూస్టుడే: రైలులో ప్రయాణిస్తూ ఓ వృద్ధుడు డోన్ మండలం దొరపల్లె వంతెన సమీపంలో కింద పడి తీవ్ర గాయాలపాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉదయం రైల్వే ట్రాక్ల మధ్య రైల్వేస్టేషన్కు కూత వేటు దూరంలోనే వృద్ధుడు కింద పడి ఉన్నా జీఆర్పీ పోలీసులకు మాత్రం మధ్యాహ్నం 1:50 గంటలకు సమాచారం వచ్చినట్లు తెలిపారు. కనీసం స్టేషన్ మాస్టర్ నుంచి సమాచారం లేకపోవడం గమనార్హం. అప్పటి నుంచి వృద్ధుడు ఎండలోనే గాయాలతో గొంతెండుతూ ఇబ్బంది పడ్డా పట్టించుకున్నవారే కరవయ్యారు. వృద్ధుడు జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అని జీఆర్పీ పోలీసులు తెలిపారు. బనగానపల్లి మండలంలోని యాగంటికి దైవ దర్శనానికి వెళ్తున్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఏ రైలులో ప్రయాణిస్తున్నట్లు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రైలు నుంచి పడటంతో కాలు తొడకు తీవ్ర గాయాలపాలయ్యరు. అంబులెన్సు కోసం ఫోన్ చేస్తే 2 గంటలైనా రాలేదని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.