అమ్మో.. ఆత్మకూరు ఠాణా
ఆత్మకూరు పోలీసు స్టేషను వివాదాలకు కేంద్రంగా మారుతోంది. న్యాయం కోసం ఠాణా గడప తొక్కిన వారి పట్ల సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టేషను నుంచి తరచూ నిందితుల పరారీ
పంచాయితీలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలు
ఆత్మకూరులోని పోలీసుస్టేషన్
ఆత్మకూరు పోలీసు స్టేషను వివాదాలకు కేంద్రంగా మారుతోంది. న్యాయం కోసం ఠాణా గడప తొక్కిన వారి పట్ల సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసుల విచారణ కంటే పంచాయితీలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కేసుల్లో అరెస్టయి స్టేషనులో ఉన్న నిందితులు.. తరచూ పరారవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్టేషను నుంచి పరారైన ఓ యువకుడి శవం చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన గత ఆదివారం ఆత్మకూరులో కలకలం సృష్టించింది. దీన్ని మరిచిపోకముందే.. సీఐ బెదిరించడంతో పాటు దుర్భాషలాడారంటూ ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారు. వరుస ఘటనలతో పోలీసు స్టేషను మెట్లెక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు.
న్యూస్టుడే, ఆత్మకూరు పట్టణం
ప్రాణం ఖరీదు రూ.12 లక్షలు
రహదారిపై బైఠాయించిన దివాకర్ బంధువులు (పాత చిత్రం)
ఓ చోరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఆత్మకూరు పట్టణానికి చెందిన దివాకర్ను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషనుకు పిలిపించారు. గత నెల 26వ తేదీ రాత్రి అన్నం తిని చేతులు శుభ్రం చేసుకునే సమయంలో ఆ యువకుడు స్టేషను నుంచి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. 28న ఆ యువకుడి మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తమ కుమారుడిని పోలీసులే లాకప్లో చంపేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. స్టేషను నుంచి పారిపోయినట్లు ఎలాంటి ఆధారాల్లేవంటూ ఆదివారం పోలీసు స్టేషన్ను ముట్టడించారు. మూడు గంటలపాటు రహదారిపై బైఠాయించారు. మరుసటి రోజు సోమవారం మృతుడి బంధువులు, పోలీసుల మధ్య కుల సంఘాల వారు పంచాయితీ చేసి రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అతని కుటుంబ సభ్యులకు రూ.12 లక్షల డబ్బు, తమ్ముడికి పురపాలక సంఘంలో ఉద్యోగం ఇప్పించేలా, ద్విచక్ర వాహనం, ఆటోలను వదిలేసేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రూ.8 లక్షలు బాధితులకు ముట్టజెప్పినట్లు చర్చ సాగుతోంది. ఇంత మొత్తంలో ఎవరు సమకూర్చారన్నది అంతుచిక్కని విషయం. పురపాలక సంఘంలో ఉద్యోగం ఇప్పిస్తామన్న హామీకి ఎవరు పూచీ ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పురపాలక పాలకవర్గ సభ్యులను వివరణ కోరితే.. ఉద్యోగం ఇస్తామంటూ ఎవరికీ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చోరీ కేసులో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనం, ఆటో బయటకు రావడం కష్టమేనని పోలీసులే చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక బయటికొస్తేనే యువకుడి మృతిపై వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక బయటికొచ్చేది సందేహమేనని పలువురు పేర్కొంటున్నారు.
నిందితుల పరారీ ఇక్కడ మామూలే..
* వివిధ కేసుల్లో అరెస్టు చేసి స్టేషనుకు తీసుకొచ్చిన నిందితులు తరచూ పరారవుతుండటం అనుమానాలకు తావిస్తోంది. పహారా కాయాల్సిన పోలీసులే వారిని తప్పిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
* డోన్కు చెందిన ఓ దొంగను పట్టుకుని స్టేషనుకు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన ఆభరణాల విలువ అధికంగా ఉండటంతో ఆ దొంగ ఓ పోలీసు అధికారికి రూ.1.50 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే పోలీసు స్టేషను నుంచి దొంగను తప్పించేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.
* ఆత్మకూరులోని గాంధీ పార్కు ప్రాంతంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసులో ఎర్రగూడూరుకు చెందిన దొంగను పోలీసులు అనంతపురంలో పట్టుకున్నారు. అతన్ని ఆత్మకూరు స్టేషనుకు తీసుకొచ్చి విచారించిన తర్వాత లాకప్లో ఉంచారు. ఉదయాన్నే చూస్తే దొంగ కనపడలేదు. విధి నిర్వహణలో ఉన్న సెంట్రీని అడిగినా ఫలితం లేదు.
* ఆత్మకూరు గరీబ్నగర్కు చెందిన ఓ దొంగను చోరీ కేసులో పట్టుకుని రాత్రి స్టేషనులో ఉంచారు. సెంట్రీ పోలీసులు విధులు మారే సమయంలో తెల్లవారుజామున 5 గంటలప్పుడు స్టేషను ప్రధాన ద్వారం నుంచే నిందితుడు పరారయ్యాడు.
* ఆత్మకూరులోని తిక్కయ్యస్వామి దర్గా ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనం కేసులో ఆటో డ్రైవరు దివాకర్ను ఇటీవల అరెస్టు చేసి స్టేషనుకు తీసుకెళ్లారు. గత నెల 26న అతను స్టేషను నుంచి తప్పించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.