logo

సీ బెళగల్‌లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం

 మండలకేంద్రమైన సీ బెళగల్‌లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 29 Mar 2024 11:50 IST

సీ బెళగల్‌ :  మండలకేంద్రమైన సీ బెళగల్‌లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత నేత ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ  జడ్పీటీసీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తెదేపా ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు పూర్తయిందన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడిందన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి  అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా విష్ణుసేన నాయకులు ఈరన్నగౌడ్‌, పెద్దమునెప్ప, కొండన్న తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని