జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
హుళేబీడులో అసంపూర్తిగా పాఠశాల అదనపు తరగతి గదులు
ఆలూరు, న్యూస్టుడే: నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిధుల కొరత కారణంగా విద్యార్థులు వరండాల్లోనూ, అర్ధాంతరంగా నిలిచిపోయిన గదుల్లోనూ విద్యనభ్యసిస్తున్నారు.
ఎక్కడెక్కడంటే..
హుళేబీడు ఉన్నత పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు సుమారు 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు ప్రత్యేక భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల కోసం కేటాయించిన గదుల్లోనే కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత ఆదోనికి వెళ్లే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్థలం కేటాయించి మూడు గదులు నిర్మించారు. తరువాత రూర్బన్ పథకం కింద మరో మూడు గదుల నిర్మాణానికి రూ.24 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారు రూ.20లక్షలు ఖర్చు పెట్టి పనులు చేపట్టారు. రూ.10లక్షల వరకు బిల్లులు అందకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో మూడు గదులు అసంపూర్తిగా ఉన్నాయి.
- పెద్దహోతూరు ఉన్నత పాఠశాలకు గదులు సరిపోకపోవడంతో అప్పట్లో రెండు గదులు నిర్మించారు. పాఠశాలలో దాదాపు 465 మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలకు అనుగుణంగా గదులు లేకపోవడంతో అసంపూర్తిగా ఉన్న గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అరికెర ఉన్నత, ఆలూరులోని ప్రధాన ప్రాథమిక పాఠశాల పరిస్థితి అంతే.
నిధులు విదల్చక...
ఆలూరు మండలంలోని హుళేబీడు, పెద్దహోతూరు, అరికెర ఉన్నత, ఆలూరులోని ప్రధాన ప్రాథమిక పాఠశాలలకు తెదేపా హయాంలో రూర్బన్ పథకం కింద అదనపు తరగతి గదులు మంజూరు చేశారు. అప్పట్లో భవన నిర్మాణ పనులు సగం వరకు పూర్తయ్యాయి. అయితే 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు తరగతి గదుల నిర్మాణాలకు చిల్లిగవ్వ విదల్చకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
వైకాపా సోషల్మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి