ముగిసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది.
87.81 శాతం మంది ఓటు హక్కు వినియోగం
2,879 మంది దూరం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే : జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. జిల్లాలోని పోలింగ్ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, శారీరక దివ్యాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్ బ్యాలట్కు దరఖాస్తు చేసుకోగా 20,733 (81.87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- జిల్లాలో 19,344 మంది పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలట్కు దరఖాస్తు చేసుకోగా 17,661 (91.30 శాతం) మంది ఓటు వేశారు.
- హోమ్ ఓటింగ్కు సంబంధించి 85 ఏళ్లకు పైబడి నడవలేనివారు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వయో వృద్ధులు 582 మంది దరఖాస్తు చేసుకోగా 536 (92.10 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 415 మందికిగాను 404 (97.35 శాతం) దివ్యాంగ ఓటర్లు ఓటేశారు.
- ఇతర జిల్లాలకు చెందిన 3,271 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్కు దరఖాస్తు చేసుకోగా 2,132 (65.18 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జాబితాలో పేర్లు లేకపోవడంతో..
- కర్నూలు జిల్లాలో ఓటర్లుగా ఉండి నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండుచోట్లా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఇతర జిల్లాల ఉద్యోగులు కర్నూలు నియోజకవర్గంలో 217 మంది, పాణ్యం నియోజకవర్గంలో 371 మంది ఓటు హక్కు వినియోగానికి దూరమయ్యారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కలిపి 1,139 మంది ఓటు వేయలేదు.
- జిల్లావాసులై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగుల్లో 19,344 మంది పోస్టల్ బ్యాలట్కు దరఖాస్తు చేసుకోగా 17,661 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,683 మంది ఓటు వేయలేకపోయారు.
- 85 ఏళ్లకు పైబడిన వయో వృద్ధుల్లో 46 మంది, 11 మంది దివ్యాంగ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అన్ని కేటగిరీల్లో కలిపి 2,879 మంది పోస్టల్ బ్యాలట్ ఓటును సద్వినియోగం చేసుకోలేకపోయారు.
-
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలింగ నర్తనోత్సవ అలంకరణలో అహోబిలేసుడు
[ 20-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఇసుక క్వారీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
[ 20-05-2024]
మండలంలోని ముడుమాల, పల్దొడ్డి, ఈర్లదిన్నె, కె.సింగవరం గ్రామాల్లోని ఇసుక క్వారీలను సోమవారం జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
[ 20-05-2024]
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
ప్లేఆఫ్స్ తొలి పోరు... రైడర్స్పై సన్ ‘రైజ్’ అయితే ఫైనల్కు!