చాకిరేవు కాదండి.. పుష్కరఘాట్
రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయాల దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. నిత్యం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తు రద్దీ ఉంటుంది. ఇక సెలవు రోజులు, పర్వదినాలు, శివరాత్రి మహోత్సవం,
భక్తుల అసంతృప్తి
పుష్కరఘాట్లో దుస్తులు శుభ్రం చేస్తున్న దృశ్యం
న్యూస్టుడే, అలంపూర్: రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయాల దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. నిత్యం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తు రద్దీ ఉంటుంది. ఇక సెలవు రోజులు, పర్వదినాలు, శివరాత్రి మహోత్సవం, దేవీ నవరాత్రులు, జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఆలయాల సమీపంలో తుంగభద్ర నది ఉండటంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం సంతరించుకుంది. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. శివ, అయ్యప్ప స్వాములు, జోగులాంబ మాలాధారణ భక్తులు తుంగభద్ర నదిలో స్నానం ఆచరిస్తారు. దేవీ నవరాత్రుల సమయంలో చివరి రోజు స్వామి అమ్మవారిని తెప్పోత్సవంలో తుంగభద్ర నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంస వాహనంలో ప్రదక్షిణలు చేయిస్తారు. పలు సందర్భాల్లో తుంగభద్ర నది పుష్కరఘాట్లో నదీహారతులు సైతం అర్చకులు నిర్వహిస్తారు. అలాంటి పవిత్రత ఉన్న నదిలో నిత్యం స్థానికులు దుస్తులు తీసుకొచ్చి శుభ్రం చేస్తున్నారు. దీంతో భక్తులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అపరిశుభ్రంగా దర్శనమిస్తుండటంతో.. : ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేదు. నీరు నిల్వగా ఉంది. పుష్కరఘాట్లో ఎగువన దస్తులు ఉతకడంతో దిగువకు సబ్బు నురుగు సైతం వస్తుంది. దీంతో పుష్కరఘాట్ చాలా మేరకు అపరిశుభ్రత నెలకొంటుంది. పవిత్రమైన క్షేత్రంలో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఆలయ నిర్వాహకులు, అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పనిసరిగా దృష్టి పెడతాం : కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. అన్ని సమస్యలపై తప్పనిసరిగా దృష్టి పెడతా. ఒక పర్యాయం అన్నీ పరిశీలించి పుష్కరఘాట్లో దుస్తులు శుభ్రం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా.
- పురేంధర్, అలంపూర్ ఆలయాల ఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం