నిత్యం కష్టాలే.. భత్యం కొందరికే
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. ఇలాంటి వారికి విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం అందించాలి. మూడేళ్లుగా కరోనా ప్రభావంతో బడులు సరిగా నడవకపోవడంతో
వెల్దండ : ఆటోలో వెళుతున్న విద్యార్థులు
న్యూస్టుడే, కందనూలు: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. ఇలాంటి వారికి విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం అందించాలి. మూడేళ్లుగా కరోనా ప్రభావంతో బడులు సరిగా నడవకపోవడంతో అందలేదు. 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్లో పాఠశాలలు ప్రారంభం కావడంతో భత్యం అందించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపారు. జిల్లాలో 759 మంది విద్యార్థులను అర్హులుగా తేల్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు 150 మంది బ్యాంకు ఖాతాల వివరాలను మాత్రమే అంతర్జాలంలో నమోదు చేశారు. మిగిలిన 609 మంది బ్యాంకు ఖాతాలు తీయకపోవడంతో అంతర్జాలంలో వివరాలను నమోదు చేయలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం ఇలా...
స్థానికంగా బడులు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలని నిబంధనలున్నాయి. విద్యార్థుల నివాస ప్రాంతానికి ప్రాథమిక పాఠశాల కి.మీ., ప్రాథమికోన్నత పాఠశాల 3 కి.మీ., ఉన్నత పాఠశాల 5 కి.మీ. దూరంలో ఉంటే ప్రతినెలా రూ.600 చొప్పున రవాణా భత్యం మంజూరు చేస్తారు. 10 నెలలపాటు చెల్లిస్తారు. ప్రాథమిక 42, ప్రాథమికోన్నత 443, ఉన్నత పాఠశాలల విద్యార్థులు 274 మంది ఎంపికయ్యారు.
జిల్లా వివరాలు..
మొత్తం పాఠశాలలు 825
చదువుతున్న విద్యార్థులు 69,517
రవాణా భత్యానికి ఎంపిక 759
11 మండలాల విద్యార్థులు దూరం..
జిల్లాలో మొత్తం 20 మండలాలుండగా రవాణా భత్యానికి 9 మండలాల విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు. పెంట్లవెల్లి, కోడేరు, బల్మూరు, తెలకపల్లి, వెల్దండ, వంగూరు, పదర, లింగాల, అచ్చంపేట, దోమలపెంట, ఉప్పునుంతల మండలాల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేదు. ఈ మండలాల్లోని విద్యార్థులు వసతిగృహాలు, కస్తూర్బాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది సమీపంలోని గ్రామాల పాఠశాలలకు వెళుతున్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులు స్పందించి అర్హులకు రవాణా భత్యం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నాం.. : జిల్లాలో 759 మంది విద్యార్థులు రవాణా భత్యానికి ఎంపికయ్యారు. ఇప్పటి వరకు 150 మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాలు అంతర్జాలంలో నమోదు చేశాం. మిగిలిన వారి బ్యాంకు ఖాతాలను త్వరగా నమోదు చేయాలని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ఉత్తర్వులిచ్చాం. విద్యార్థుల హాజరు శాతాన్నిబట్టి భత్యం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
- వెంకటయ్య, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!