logo

పాటలు వింటూ.. హీటర్‌ పట్టుకుని..

ఇయర్‌ ఫోన్స్‌లో పాటలు వింటూ.. స్నానం చేయడానికి హీటర్‌ పెట్టుకోబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మల్దకల్‌ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న,

Published : 13 Aug 2022 07:04 IST

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

క్షేత్రన్ననాయుడు

విఠలాపురం(మల్దకల్‌) : ఇయర్‌ ఫోన్స్‌లో పాటలు వింటూ.. స్నానం చేయడానికి హీటర్‌ పెట్టుకోబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మల్దకల్‌ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న, శారదమ్మల కుమారుడు క్షేత్రన్న నాయుడు(20) గద్వాలలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం బంధువుల నూతన గృహ ప్రవేశ వేడుకలు ఉంటే స్వగ్రామానికి వచ్చాడు. గురువారం రాత్రి స్నానం చేయడానికి ఇయర్‌ఫోన్స్‌ చెవిలో పెట్టుకుని హీటర్‌ను ముందుగా బోర్డు స్విచ్‌ ఫ్లగ్‌లో ఉంచాడు. పాటలు వింటూ అనుకోకుండా హీటర్‌ను చేతితో పట్టుకుని నీటి బకెట్‌లో ఉంచడానికి ప్రయత్నించేలోపే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. యువకుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని