విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృత్యువాత
పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన ఓ గిరిజన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని రేకులపల్లితండా శివారులో చోటు చేసుకుంది.
వసరాంనాయక్
కోడేరు, న్యూస్టుడే : పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన ఓ గిరిజన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని రేకులపల్లితండా శివారులో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రేకులపల్లి తండాకు చెందిన రైతు కేతావత్ వసరాంనాయక్ (58) పొలంలో వరి నాట్ల కోసం కరిగెట చేయించాడు. రాగుల (తైదలు) పంటకు నీరు పారబెట్టాక విద్యుత్తు మోటార్ వద్ద మృతి చెందాడు. స్టార్టర్కు విద్యుత్తు సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించని రైతు బంద్ చేయడానికి వెళ్లి మృతి చెంది ఉంటాడని కుటుంబికులు తెలిపారు. వసరాంనాయక్కు భార్య, కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రావుల రమేశ్
కందనూలు, న్యూస్టుడే : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం నాగర్కర్నూల్ మండలంలోని మల్కాపూర్ గేట్ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతలపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన రావుల రమేశ్ (34) స్టీల్ సామగ్రి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల సోదరుడు రావుల సత్యనారాయణ మృతి చెందగా నెల వారీ పూజా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వనపర్తికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో మండలంలోని మల్కాపూర్ గేట్ వద్దకు రాగానే నాగర్కర్నూల్ నుంచి తాడూరు వైపు వస్తున్న బొలెరొ, ద్విచక్ర వాహనం ఎదురుఎదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో రమేశ్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. రావుల రమేశ్ అవివాహితుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.
బావిలో పడి లారీ డ్రైవర్...
జమ్మికుంట, న్యూస్టుడే : లారీలో ఇసుక లోడింగ్కు వచ్చిన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం జల్గడ్డ తండాకు చెందిన డ్రైవర్ కిషన్ (60) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఇసుక క్వారీ సమీప బావిలో పడి మృతి చెందారు. పోలీసులు, కిషన్ తనయుడు సురేశ్ కథనం ప్రకారం.. ఇసుకను తీసుకెళ్లడానికి కిషన్ షాద్నగర్ నుంచి బుధవారం లారీ తీసుకుని తనుగుల ఇసుక క్వారీకి వచ్చారు. గురువారం ఉదయం కుమార్తెతో చరవాణిలో మాట్లాడారు. మధ్యాహ్నం ఆయన మృతదేహం క్వారీ సమీపంలోని బావిలో తోటి డ్రైవర్లు గుర్తించారు. విషయం తెలిసి ఏఎస్సై రాధాకిషన్ సంఘటన స్థలానికి చేరుకుని కిషన్ కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా కుమారుడు సురేశ్ సాయంత్రం జమ్మికుంటకు చేరుకున్నారు. చనిపోయింది తన తండ్రియేనని ధ్రువీకరించారు. కాగా ఇసుక లోడింగ్కు వచ్చిన డ్రైవర్ బావిలో ఎలా పడ్డారో స్పష్టం కావడం లేదు. కుటుంబసభ్యుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని జమ్మికుంట సీఐ రాంచందర్రావు చెప్పగా, శుక్రవారం తల్లి లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు వచ్చాకే ఫిర్యాదు చేస్తానని సురేశ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం