ఉరకలెత్తిన వృషభ రాజాలు
పట్టణంలోని శ్రీచౌడేశ్వరీదేవి జాతర సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
సీనియర్స్ విభాగం పోటీల్లో బండలాగుతున్న వృషభాలు
పెబ్బేరు, న్యూస్టుడే : పట్టణంలోని శ్రీచౌడేశ్వరీదేవి జాతర సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు వృషభాలను తీసుకొచ్చారు. ఆదివారం నిర్వహించిన సీనియర్ విభాగం పోటీలను డీసీసీ కార్యదర్శి మొగిలి సత్యారెడ్డి ప్రారంభించారు. పోటీల కన్వీనర్ చిదంబర్రెడ్డి, నిర్వాహకులు విజయవర్ధన్రెడ్డి, భానుప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన ఎద్దుల యజమానులకు పుర ఛైర్పర్సన్ కరుణశ్రీ బహుమతులు అందించారు.
పాలపళ్ల విభాగంలో.. : పాలపళ్ల విభాగం పోటీలో ఏడు జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతి ఏపీలోని నంద్యాల జిల్లాకు సుధీర్కుమార్రెడ్డి, ప్రభాకర్రెడ్డి ఎద్దులు దక్కించుకొన్నాయి. ద్వితీయ బహుమతి జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయవరానికి చెందిన రామచంద్రారెడ్డి ఎద్దులు, తృతీయ బహుమతికి ఇదే జిల్లాకు చెందిన చంద్రన్న ఎద్దులు ఎంపికయ్యాయి. నాలుగో బహుమతి గద్వాల జిల్లాకు చెందిన విజయలక్ష్మి, నవనీతరెడ్డి ఎద్దులు దక్కించుకొన్నాయి. అయిదో బహుమతిని కర్నూలు జిల్లా కలుగొట్లకు చెందిన గొంది బజార్ ఎద్దులు గెలుచుకొన్నాయి.
న్యూ కేటగిరి విభాగంలో..: న్యూ కేటగిరికి విభాగంలో తొమ్మిది జతల ఎద్దులు పాల్గొన్నాయి. తెలంగాణకు చెందిన అఖిలేష్రెడ్డి ఎద్దులు మొదటి బహుమతి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్కు చెందిన వెంకటేశ్వర్లు, శివకోటి వృషభరాజాలు ద్వితీయ బహుమతి, కర్ణాటక రాష్ట్రంలోని బిజినేగిరికి చెందిన కుమారస్వామి ఎద్దులు తృతీయ, కర్నూలు జిల్లా కానాపురానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు ఎద్దులు నాలుగో, నంద్యాల జిల్లాలోని రోళ్లపాడుకు చెందిన మురళీమోహన్ ఎద్దులు అయిదో బహుమతి సాధించాయి.
సీనియర్ విభాగంలో ..: సీనియర్ విభాగంలో 10 జతల ఎద్దులు పాల్గొనగా సూర్యాపేట జిల్లాకు చెందిన సుంకి సురేందర్రెడ్డి ఎద్దులు ప్రథమ బహుమతిగా రూ.70 వేలు గెలుచుకొన్నాయి. నంద్యాల జిల్లా మూడురాళ్లపల్లికి చెందిన పులిచిన ఓబుల్రెడ్డి ఎద్దులు ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు సాధించాయి. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన గుర్నాథ్ ఎద్దులు తృతీయ బహుమతిగా రూ.45 వేలు, అనంతపురం జిల్లా కృష్ణాపురం గ్రామానికి చెందిన నాగేశ్వర్రెడ్డి ఎద్దులు నాలుగో బహుమతిగా రూ.25 వేలు, కొత్తకోటకు చెందిన రామ్మోహన్ ఎద్దులు అయిదో బహుమతిగా రూ.15 వేలు గెలుచుకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?