ఆదిలో గుర్తిస్తే అడ్డుకట్ట
ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. లక్షణాలు మొదటి స్థాయిలో గుర్తించిన వారికి తగిన చికిత్స ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి.
చాపకింద నీరులా క్యాన్సర్
న్యూస్టుడే, పాలమూరు, వనపర్తి న్యూటౌన్
మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. లక్షణాలు మొదటి స్థాయిలో గుర్తించిన వారికి తగిన చికిత్స ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. కానీ వెనుకబడిన పాలమూరు జిల్లాలో అనేక మంది రెక్కాడితేకాని డొక్కాడని పేదలు, నిరక్షరాస్యులే. అలాంటి వారికి రక్త పరీక్షలు చేయించుకునేంత అవగాహన లేదు. దీంతో వారికి వచ్చిన జబ్బు గురించి కూడా తెలియడం లేదు. దీని కారణంగానే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండేళ్ల కిందట ఉమ్మడి జిల్లాలో 474 మంది క్యాన్సర్ రోగులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 1,260కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
అన్ని జిల్లాల్లో పాలియేటివ్ కేర్ కేంద్రాలు..
క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే జిల్లాలో తగిన చికిత్స అందించడానికి అవకాశం ఉంది. ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం హైదరాబాద్కు వెళ్లాల్సిందే. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పాలియేటిక్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాధి బారిన పడిన వారికి తగిన కౌన్సెలింగ్ ఇస్తూ.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2018 ఏప్రిల్ 2న పాలియేటివ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ క్యాన్సర్ రోగులకు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పిస్తున్నారు. ఆ తర్వాత మిగతా నాలుగు జిల్లాల్లోని ఆసుపత్రుల్లోనూ పాలియేటిక్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి కూడా శైశవ దశలోనే ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలను ఇంకా కల్పించలేదు. ఇప్పుడిప్పుడు సౌకర్యాలను కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి క్యాన్సర్ రోగులను చేర్చుకొని, వారికి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇంటి వద్దకే వెళ్లి సేవలు...: గ్రామాలు, పట్టణాల్లో క్యాన్సర్ రోగులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. అందులో ఒక వైద్యుడు, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఒక ఫిజియో థెరపిస్టు ఉంటారు. అందరూ వెళ్లి రోగికి ఇంటి దగ్గరే సపర్యలు చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండి మంచానికే పరిమితం అయిన వారికి ఫిజియోథెరపి చికిత్స కూడా అందిస్తున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు వారికి మందులను ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేళకు ఇవ్వాల్సిన మందులు, వారికి అందించాల్సిన సేవలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. నెలకు సరిపడా మందులను ఇస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రామాల చొప్పున ప్రత్యేక వాహనంలో తిరుగుతున్నారు. అన్ని జిల్లాల్లో పాలియేటివ్ కేర్ కేంద్రాలు ఉండటంతో అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నారు.
వివిధ కారణాలు..
ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ రోగులు పెరగడానికి వివిధ కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో వాయు కాలుష్యం కారణంగా పలువురు ఊపిరి తిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. గుట్కాలు, జర్దాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల బీడీ కార్మికులు అధికంగా ఉన్నారు. నిత్యం పొగాకుతో బీడీలు చుడుతున్నవారిలో కూడా క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు తెలిపారు. నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి తదితర జిల్లాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. అక్కడ ఎక్కువగా గంజాయి వాడకం కారణంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తిస్తున్నారు.
మంచి సేవలు అందిస్తున్నాం..: క్యాన్సర్ బారిన పడిన వారికి సాంత్వన కల్పించడానికి పాలియేటివ్ కేర్ సెంటర్ల ద్వారా మంచి సేవలు అందిస్తున్నాం. ఇంట్లో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి రోగులను సెంటర్కే రప్పించుకుంటున్నాం. కొన్ని రోజుల పాటు వారు ఇక్కడే ఉండి వెళ్తున్నారు. వారికి సిబ్బంది అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. రోగులకు పౌష్టికాహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నాం.
డా.సంధ్యాకిరణ్మయి, క్యాన్సర్ నోడల్ అధికారి, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?