శిథిల వారధులపై శీతకన్ను
కొల్లాపూర్ నుంచి నాగర్కర్నూల్, వనపర్తి, పెబ్బేరు, నల్లమల, కృష్ణాతీర గ్రామాలకు రాకపోకలు గల రహదారుల మధ్యలో వాగులపై నిర్మాణం చేసిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి.
న్యూస్టుడే, కొల్లాపూర్
జటప్రోల్ వంతెన పరిస్థితి ఇదీ..
కొల్లాపూర్ నుంచి నాగర్కర్నూల్, వనపర్తి, పెబ్బేరు, నల్లమల, కృష్ణాతీర గ్రామాలకు రాకపోకలు గల రహదారుల మధ్యలో వాగులపై నిర్మాణం చేసిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. చాలా ఏళ్లుగా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. ప్రతి ఏటా దెబ్బతిన్న వంతెనలు గుర్తించి ప్రతిపాదనలు చేసి సంబంధిత రోడ్లు, భవనాలశాఖ అధికారులు వదిలేస్తున్నారు. దీంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. అయినా మరమ్మతులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రమాదకర వంతెనల దుస్థితిపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
పరిస్థితి ఇలా..
* కొల్లాపూర్ నుంచి ఎల్లూరు, మొలచింతలపల్లి, నార్లాపూర్ గ్రామాలకు గల రహదారుల మధ్యలో వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎల్లూరు శివారులో ఎంజీకేఎల్ఐ, మిషన్ భగీరథ, పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. కానీ ఎల్లూరు గ్రామానికి సమీపంలోని చిన్నవాగుపై 30 ఏళ్ల క్రితం వంతెన నిర్మాణం చేశారు. ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్నది. కింద ఇనుపకడ్డీలు తేలి సిమెంట్ రాలిపోతున్నది. మొలచింతలపల్లి వాగుపై నిర్మించిన వంతెనకు మరమ్మతులు లేవు. శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ, వాగునీళ్ల ప్రవాహంతో ఈ వాగుపై వంతెన నిర్మాణం 40 ఏళ్ల క్రితం నిర్మించారు. నేటికి కూడా మరమ్మతులకు మోక్షం లేక పట్టించుకోవడం లేదు.
* కొల్లాపూర్ నుంచి వనపర్తి మధ్యలో కొల్లాపూర్ మూలవాగు ప్రాంతంలో, సింగోటం, తెల్లరాళ్లపల్లి ప్రాంతాలలో వాగులపై నిర్మించిన వంతెనలకు చాలా ఏళ్లుగా మరమ్మతులు లేవు. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి.
* కొల్లాపూర్ నుంచి పెబ్బేరుకు వెళ్లే మధ్యలో జటప్రోల్ దగ్గర వంతెన పూర్తిగా దెబ్బతిన్నది. శ్రీశైలం తిరుగుజలాలు నిల్వతో ఈ వాగుపై వంతెన నిర్మించారు. 40 ఏళ్లు అవుతున్న మరమ్మతులను విస్మరించారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో వంతెన అడుగుభాగంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. పైన రహదారి దెబ్బతిన్నది. అదే విధంగా పెంట్లవెల్లి నుంచి మాధవస్వామినగర్ మధ్యలో వంతెన, కొల్లాపూర్ నుంచి చౌటబెట్ల, తాళ్లనర్సింహాపురం మధ్యలో వాగులపై వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వీటికి కూడా మరమ్మతులు లేవు. ఇప్పటికైనా ప్రమాదకరంగా మారిన ఈ వంతెనలకు మరమ్మతులు చేసి రాకపోకల ఇబ్బందులు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు, ద్విచక్ర వాహన చోదకులు కోరుతున్నారు.
* వంతెనల ప్రమాదకర పరిస్థితులను ‘న్యూస్టుడే’ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. సంబంధిత అధికారులకు చెప్పి దెబ్బతిన్న వంతెనలను గుర్తించి మరమ్మతులకు ప్రతిపాదనలు చేయాలని ఆదేశిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని వంతెనలకు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
కొల్లాపూర్ మూలవాగుపై వంతెన రక్షణగోడలు దెబ్బతిన్న దృశ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM