logo

గొలుసు దొంగకు ఆర్నెల్ల జైలు

రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థిని మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన నిందితుడికి సికింద్రాబాద్‌లోని రైల్వేకోర్టు ఆర్నెల్ల జైలుశిక్ష విధించింది.

Published : 21 Mar 2023 02:07 IST

రెజిమెంటల్‌బజార్‌, మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థిని మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన నిందితుడికి సికింద్రాబాద్‌లోని రైల్వేకోర్టు ఆర్నెల్ల జైలుశిక్ష విధించింది. మహబూబ్‌నగర్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రాములు సోమవారమిక్కడ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన డెగులపాటి సత్తన్న(35) ప్రైవేట్‌ ఉద్యోగి. 2020 మార్చి 20న బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న యశ్వంత్‌పూర్‌ రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థిని రీతికారెడ్డి మెడలో నుంచి తులం బంగారు గొలుసును స్నాచింగ్‌ చేశాడు. దీంతో బాధితురాలు మహబూబ్‌నగర్‌ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన జరిగిన మూడు రోజులకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం పూర్తి ఆధారాలతోకూడిన సాక్ష్యాలను పోలీసులు కోర్టులో సమర్పించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఎం.డి.గౌస్‌పాషా.. నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారని వెంకట్‌రాములు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని