సమన్వయలోపం.. పౌరసేవలకు ఆటంకం
ప్రతి పంచాయతీ కార్యాలయంలో అంతర్జాల వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులో తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను అందజేసింది.
ధరూరు: వామన్పల్లి పంచాయతీలో కంప్యూటర్
గద్వాల న్యూస్టుడే: ప్రతి పంచాయతీ కార్యాలయంలో అంతర్జాల వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులో తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను అందజేసింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవటంతో అవి దిష్టిబొమ్మల్లా మారాయి. పూర్తి స్థాయిలో అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు మిషన్ భగీరథ పనులతో పాటు అంతర్జాల కేబుల్ లైన్ వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 255 పంచాయతీలు ఉండగా 90 శాతం కేబుల్ లైన్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచాయతీల్లోని అంతర్జాల వ్యవస్థకు అనుసంధానం విషయంలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించటం లేదు.
కనెక్టివిటీ ఇచ్చేదెప్పుడు
ఈ పంచాయతీ వ్యవస్థలో భాగంగా తొలుత మండల కేంద్రాల్లోని పంచాయతీలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందజేశారు. వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేక లోకల్ నెట్ ద్వారా లేదా పంచాయతీ కార్యదర్శుల చరవాణుల ద్వారా ఆన్లైన్ వివరాలు నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. టీఎస్ ఫైబర్ నెట్ కేబుల్ జిల్లాలో 220 పంచాయతీలకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. పంచాయతీల్లోని అంతర్జాల వ్యవస్థకు కనెక్టివిటీ మాత్రం చేయలేదు. అసలు పంచాయతీల పాలక వర్గాల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ఐదేళ్లు గడుస్తున్నా ఈ పంచాయతీ వ్యవస్థలో పురోగతి కనిపించటం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీల్లో ఇబ్బందులు
పల్లె ప్రగతి పనులు, నిధుల ఖర్చు, ఇతర అభివృద్ధి పనుల పురోగతి, జనన, మరణ, ఇంటి అనుమతులు, ఇతరత్రా అనుమతుల పత్రాలు ఆన్లైన్ ద్వారా పంచాయతీ కార్యాలయాల్లో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆన్లైన్ నమోదు పనులన్నీ స్థానికంగా ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీఎస్ ఫైబర్ నెట్ కనెక్టివిటీ పంచాయతీలకు అందిస్తే ఉపయోగంగా ఉంటుంది. అసలు కనెక్టివిటీ ఇవ్వాల్సింది ఎవరనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ కారణంగా ఆయా పంచాయతీలకు పంపిణీ చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఉన్నచోటే దుమ్ము పట్టిపోతున్నాయి.
జిల్లాలో పంచాయతీలు 255
సామగ్రి పంపిణీ అయినవి 214
కేబుల్ అందుబాటులో ఉన్నవి 220
అనుసంధానం చేయాల్సింది వారే : కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు అందజేయాల్సి బాధ్యత మాత్రమే మాది. కనెక్టివిటీ అనుసంధానం చేయాల్సిన బాధ్యత టీఎస్ ఫైబర్ పనులు చేపడుతున్న సంస్థ వారిది. జిల్లాలో చాలా వరకు పంచాయతీలకు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటిదే సమస్య ఉంది.
శ్యామసుందర్, జిల్లా పంచాయతీ అధికారి, జోగులాంబ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం