విలక్షణ తీర్పుల వేదిక మక్తల్
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మక్తల్ నియోజకవర్గానికి రాజకీయంగా విభిన్న పార్టీలను ఆదరించిన ఘనత ఉంది.
ఆత్మకూరు, న్యూస్టుడే : కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మక్తల్ నియోజకవర్గానికి రాజకీయంగా విభిన్న పార్టీలను ఆదరించిన ఘనత ఉంది. నియోజకవర్గంలోని తంగిడి గ్రామం వద్ద కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తూర్పున దేవరకద్ర, పడమరాన కర్ణాటక, ఉత్తరాన నారాయణపేట, దక్షిణాన గద్వాల నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్న ఈ నియోజకవర్గం మీదుగా అంతర్రాష్ట్ర రహదారితో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలకు రైల్వే ప్రయాణ సదుపాయం ఉంది. జూరాల ప్రాజెక్టుతో పాటు భీమా మొదటి దశ ఎత్తిపోతల పథకం, రామన్పాడు జలాశయాలు సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. నియోజకవర్గం పరిధిలోని చేనేతతో పాటు బీడీ పరిశ్రమ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.
2009 శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మక్తల్ నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద మండలాలను తొలగించి, కొత్తగా ఏర్పడిన నారాయణపేట నియోజకవర్గంలో చేర్చారు. రద్దయిన అమరచింత శాసనసభ నియోజకవర్గం నుంచి ఆత్మకూరు, నర్వ మండలాలను మక్తల్ నియోజకవర్గ పరిధిలోకి కలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో కొత్తగా అమరచింత, క్రిష్ణా మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోకి మక్తల్, క్రిష్ణా, మాగనూర్, ఊట్కూర్, నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు మదనాపురం మండలంలోని మూడు, మరికల్ మండలంలోని మూడు, ధన్వాడ మండలంలోని ఒక గ్రామ పంచాయతీ వస్తుంది. నియోజకవర్గం పూర్తి స్థాయిలో పది మండలాల గ్రామాలతో విస్తరించింది.
- నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్, జనతాదళ్, తెలుగుదేశం పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులను సైతం ఆదరించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బసప్ప.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నా గెలిపించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి కల్యాణి రాంచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనతాపార్టీ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన చిట్టెం నర్సిరెడ్డి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏల్కోటి ఎల్లారెడ్డి 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తన రాజకీయ గురువుగా భావించే చిట్టెం నర్సిరెడ్డిని ఓడించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వారిలో కల్యాణి రాంచందర్రావు, ఏల్కోటి ఎల్లారెడ్డిలకు మంత్రి పదవులు వరించాయి. వీరిద్దరూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రులుగానే కొనసాగారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన చిట్టెం నర్సిరెడ్డి 15ఆగస్టు 2005న నారాయణపేట పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘనటలో ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర్రెడ్డితో పాటు అంగరక్షకులు చనిపోయారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డి విజయం సాధించారు.
- నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అమరచింత శాసనసభ స్థానానికి రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన కొత్తకోట దయాకర్రెడ్డి మక్తల్ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు.
- 1983లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగినా మక్తల్ శాసనసభ స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సింహులు నాయుడు సమీప జనతాపార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎల్లారెడ్డికి ధరావతు దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమీక్షలు.. వ్యూహ రచనలు
[ 03-05-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. -
ఇంజినీరింగ్ కళాశాలకు సన్నాహాలు
[ 03-05-2024]
నిధుల కొరత, అసౌకర్యాలతో 16 ఏళ్లుగా కొట్టుమిట్టాడుతున్న పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం ఉష)కు ఎంపిక కావటంతో దశ మారనుంది. -
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: యెన్నం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్, తిర్మలగిరి, నాయినోనిపల్లి, పుల్పవానిపల్లి, చిన్నదర్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. -
మూడోసారి కేంద్రంలో భాజపానే
[ 03-05-2024]
దేశవ్యాప్తంగా భాజపా 400కు పైగా లోక్సభ స్థానాలు కైవసం చేసుకొని మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమని కేంద్ర ప్రసార, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. -
భారత్లో ఓటు ప్రస్థానమిదీ..
[ 03-05-2024]
ఆంగ్లేయుల పాలనలో మండలాలను ఫిర్కాలుగా పిలిచేవారు. అప్పట్లో ఫిర్కాకు కార్కోన్ అనే హోదాలో ఓ ఉద్యోగి విధులు నిర్వహించేవారు. -
పన్ను రాయితీ సద్వినియోగం అంతంతే
[ 03-05-2024]
ఏడాది కాలానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏకకాలంలో చెల్లిస్తే పొందే 5 శాతం రాయితీ వెసులుబాటును పురపాలికల్లోని వ్యాపారులు, ఇళ్ల యజమానుల్లో తక్కువ మందే వినియోగించుకున్నారు. -
పరివార్
[ 03-05-2024]
లోక్సభ స్థానంలో విజయం సాధించడం అత్యంత గౌరవప్రదంగా ప్రతి నాయకుడూ భావిస్తున్నారు. అందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు అహర్నిశలు కష్టపడుతున్నారు. -
ఓటింగ్ను అడ్డుకుంటే మూడేళ్ల జైలు
[ 03-05-2024]
పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో దుండగులు పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనంలోకి తీసుకొని ఓటింగ్ అడ్డుకోవడాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. -
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్కు కృషి : వంశీచంద్రెడ్డి
[ 03-05-2024]
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ఓటమి భయంతో నీచ రాజకీయాలు: డీకే అరుణ
[ 03-05-2024]
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని భాజపా మహబూబ్నగర్ లోక్సభ స్థానం అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
మైనారిటీ విద్యార్థులకు 408 గురుకులాలు : మన్నె
[ 03-05-2024]
గత ప్రభుత్వాలు ముస్లింలను అన్ని రంగాల్లో విస్మరించారని, భారాస పదేళ్ల పాలనలో ప్రత్యేకంగా మైనార్టీలకు 408 గురుకులాలు నిర్మించామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి: మల్లు రవి
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని అందుకే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పార్టీ అభ్యర్థి మల్లు రవి కోరారు. -
ఆరు గ్యారంటీల అమలు ఏదీ: భాజపా
[ 03-05-2024]
కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి శూన్యమని నాగర్కర్నూల్ భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ విమర్శంచారు. గురువారం బావాయిపల్లి, తీగలపల్లి, జనుంపల్లి, కోడేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రాముడి పేరుతో రాజకీయాలా?
[ 03-05-2024]
భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తూ రాముని పేరుతో అక్షింతలు పంపిణీ చేసి ఓట్లు పొందాలనుకుంటోందని, కేసీఆర్కు మాత్రం ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
మైకంలో ఆలినే కడతేర్చాడు
[ 03-05-2024]
ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను మద్యం తాగిన మైకంలో కత్తిపీటతో గొంతు కోసి దారణంగా హత మార్చిన సంఘటన గురువారం నాగర్కర్నూల్ మండలం వనపట్లలో చోటు చేసుకుంది. -
అవగాహన కల్పిస్తారా... మమ అనిపిస్తారా!
[ 03-05-2024]
ఏటా విద్యుదాఘాతానికి గురై పదుల సంఖ్యలో రైతులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో 14 మందికి పైగా రైతులు, వినియోగదారులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
పురపాలికలపై సైబర్ నేరగాళ్ల నజర్
[ 03-05-2024]
సైబర్ నేరగాళ్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగారు. ట్రేడ్ లైసెన్సు ఫీజులు, లేబర్ ఛార్జీలు తగ్గిస్తామంటూ అక్రమాలకు తెర లేపారు. బడా వ్యాపారులతో పాటు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణాదారులను మోసం చేస్తున్నారు. -
అడ్డూ అదుపు లేని ఇసుక మాఫియా
[ 03-05-2024]
రాత్రీపగలు తేడాలేకుండా వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, ఠాణా నుంచి ఒక కానిస్టేబుల్ను పర్యవేక్షణకు ఇన్ఛార్జిగా నియమించారు.. రవాణాదారులు వారిని గుప్పెట్లోకి పెట్టుకుంటున్నారు. -
ప్రజా దీవెనలతో విజయం: జూపల్లి
[ 03-05-2024]
నమ్మి వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.