logo

రెండు గడ్డివాముల దగ్ధం

మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి.

Published : 29 Mar 2024 19:40 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామంలోని పునరావాస గృహాల వద్ద నివాసం ఉండే పేతూరు, కృష్ణ అనే వ్యక్తులు ఒక చోట గడ్డివాములను ఇటీవలే కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నారు. అయితే మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటిచడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిళ్లిందని బాధితులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని