logo

మలేరియాపై అవగాహన ర్యాలీ

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Published : 25 Apr 2024 12:41 IST

రాజోలి : ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్ ఓ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని గాంధీ చౌక్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియాను అరికట్టేందుకు దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని