logo

భాజపాతోనే దేశాభివృద్ధి

భాజపాతోనే దేశాభివృద్ధి చెందుతుందని జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు.

Updated : 04 May 2024 20:35 IST

రామారెడ్డి: భాజపాతోనే దేశాభివృద్ధి చెందుతుందని జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. శనివారం రామారెడ్డిలో కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు చేసి స్ట్రీట్ కార్నర్ సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసినట్లు పేర్కొన్నారు. మరోసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంగారం, భాజపా మండల అధ్యక్షుడు ఈశ్వర్, ఉపాధ్యక్షుడు సందీప్, గ్రామ అధ్యక్షుడు దేవిదాస్, మోహన్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని