logo

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌ : మన్నె

రుణమాఫీ చేయకుండా, బోనస్‌ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 05 May 2024 02:14 IST

సమావేశంలో మాట్లాడుతున్న మహబూబ్‌నగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి

దేవరకద్ర గ్రామీణం, న్యూస్‌టుడే : రుణమాఫీ చేయకుండా, బోనస్‌ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లి, గోపన్‌పల్లి, గూరకొండ, గద్దెగూడెం, బొల్లారం, పెద్దరాజమూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. గ్రామాల్లో విద్యుత్తు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  తాగునీటి కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయలేదన్నారు. భాజపా పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. భాజపా, కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. మరోసారి గెలిపించాలని, పార్లమెంటులో పాలమూరు గళం వినిపించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌ యాదవ్‌, శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, గురుప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని