కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పాలనాధికారి
మంత్రి హరీశ్రావు
సమీక్ష నిర్వహిస్తున్న హరీశ్రావు, చిత్రంలో ఎంపీ బీబీపాటిల్, జడ్పీ అధ్యక్షురాలు
మంజుశ్రీ, ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రెడ్డి, జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్టుడే: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పాలనాధికారి కార్యాలయంలో దళితబందు పథకం అమలుకు కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. విజయవంతం అయిందన్నారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారి పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. వారు కోరుకున్న యూనిట్కు సంబంధించి శిక్షణ ఇవ్వడం, గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుని వాటా రూ.10వేలు, ప్రభుత్వం మరో రూ.10 వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి 5లోగా దళితబంధుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి 7వ తేదీ నాటికి యూనిట్ను గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పాడి పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. గేదెలకు వంద శాతం ఇన్సూరెన్స్ ఉందన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని లబ్ధిదారులు సరైన నిర్ణయం తీసుకునేలా చూడాలని చెప్పారు. రానున్న రెండేళ్లలో సర్కారు పాఠశాలలను బాగు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని తెలిపారు. నీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలలకు పెయింటింగ్, మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, డిజిటల్ తరగతుల ఏర్పాటు తదితర పనులు చేపడతామన్నారు. మొదటి విడతలో ఎక్కువ మంది విద్యార్థులున్న 35 పాఠశాలల ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, భూపాల్రెడ్డి, మాణిక్రావు, క్రాంతి కిరణ్, అదనపు పాలనాధికారి వీరారెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, వ్యవసాయశాఖ జేడీ నరసింహారావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక