నవతరానికి నైపుణ్య పాఠాలు
పోటీ ప్రపంచంలో ఉపాధి పొందేందుకు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) డిగ్రీలో పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. దీనిద్వారా విషయ నైపుణ్యంతోపాటు, మానసిక వికాసానికి దోహదపడేలా పాఠ్య ప్రణాళికను
జీవన్ కౌశల్ కోర్సుతో ఉజ్వల భవిత
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
నేర్చుకుంటున్న విద్యార్థులు
పోటీ ప్రపంచంలో ఉపాధి పొందేందుకు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) డిగ్రీలో పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. దీనిద్వారా విషయ నైపుణ్యంతోపాటు, మానసిక వికాసానికి దోహదపడేలా పాఠ్య ప్రణాళికను రూపొందించింది. ఈ దశలోనే విద్యార్థులకు సరైన మార్గనిర్దేశనం చేయాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జీవన్కౌశల్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునేందుకు అవసరమైన అంశాలను బోధిస్తారు. ఈ నేపథ్యంలో కథనం.
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా...
జీవన్ కౌశల్కు గత విద్యా సంవత్సరంలోనే రూపకల్పన చేశారు. అవగాహన లేకపోవడంతో కొందరు మాత్రమే ఇందులో చేరారు. ఈ విద్యా సంవత్సరం ఎక్కువమంది ఈ కోర్సును ఎంచుకునేలా అవగాహన కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. 8 క్రెడిట్లతో జీవన్ కౌశల్ కోర్సును రూపొందించారు. నాలుగు అంశాలుగా కోర్సును విభజించారు. ఒక్కో అంశాన్ని 30 గంటలు చెప్పడంతోపాటు రెండు క్రెడిట్లు ఇస్తారు. ఇలా నాలుగు అంశాలకు కలిపి 120 గంటల్లో కోర్సు పూర్తవుతుంది.
బోధనతో ప్రయోగాలు..
బోధనతోపాటు ప్రాజెక్టు వర్క్లు ఉండేలా పాఠ్యప్రణాళికను రూపొందించారు. పాఠం బోధించాక విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించే విధానం అమలులో ఉంది. వారు ఎంత మేరకు నైపుణ్యాలు నేర్చుకున్నారో దీనిద్వారా అంచనా వేస్తారు. తరగతి గదిలోనే రాత, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత కళాశాలలోనే మూల్యాంకనం ఉంటుంది.
వినడం.. చదవడం.. అర్థం చేసుకోవడం
అధ్యాపకుడు బోధిస్తున్నప్పుడు పాఠాలు ఏకాగ్రతతో వినాలి. వాటిని ఇంటికి వెళ్లాకా చదవాలి. అర్థం చేసుకోవడం కూడా అవసరం. ప్రస్తుతం విద్యార్థులకు ఇది కష్టంగా మారింది. దీంతో లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. జీవన్ కౌశల్ కోర్సులో వినడం, చదవడం, అర్థంచేసుకోవడం.. అంశాలకు ప్రధాన ప్రాధాన్యం ఉంటుంది. ఈ అంశాలకు ప్రత్యేకంగా 17 గంటలు కేటాయించారు. చిత్తు ప్రతులలో రాయించడంతో ప్రారంభించి రచనా నైపుణ్యాలు మెరుగుపరుస్తారు.
నేర్పించే అంశాలివి..
* నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి ప్రస్తుతం అవకాశాలకు కొరత లేదు. ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వేతనం కూడా ఎక్కువే ఇస్తున్నారు. జీవన్కౌశల్ కోర్సులో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
* సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మానవ విలువలు గుర్తెరిగితే అందరూ బాగుండాలన్న ఆలోచనకు బాటలు పడతాయి. అందుకే ఈ అంశాన్ని పాఠ్యాంశంలో చేర్చారు.
* ఇప్పుడు ఎదుటివారిని మెప్పించగలిగే నేర్పు ఉండటం ముఖ్యం. అలాంటి వారికి సంస్థలు, పరిశ్రమల్లోనూ ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. జీవన్కౌశల్ కోర్సులో ఇది కూడా ఒక అంశమే.
* విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివేలా తీర్చిదిద్దుతారు. నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనకు సలహాలు, సూచనలు చేస్తారు.
సద్వినియోగంతో భవిష్యత్తు
-హుమేరా సయీద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(సంగారెడ్డి)
జీవన్ కౌశల్ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. కోర్సులో చేరేందుకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. విద్యార్థులు ఇష్టపూర్వకంగా కోర్సును ఎంచుకునేందుకు స్వేచ్ఛ ఉంది. జీవన్కౌశల్లో చేరడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుతోపాటు ప్రయోగాలతో విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక