ఏడు నెలలు.. 1348 విద్యుత్తు చౌర్యం కేసులు
విద్యుత్తు వినియోగం తీరుతెన్నుల గణాంకాలు ఎప్పుడు చూసినా సరిపోలటం లేదు. విద్యుత్తు డిమాండ్, సరఫరా కోసం ప్రణాళికలు ఒక్కోసారి తారామారు అవుతున్నాయి. విచ్చలవిడిగా వాడటం వల్ల గందరగోళంగా ఉంటోంది.
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్
అక్రమంగా విద్యుత్తు వాడుకోవడానికి వేసిన కొక్కేలు
విద్యుత్తు వినియోగం తీరుతెన్నుల గణాంకాలు ఎప్పుడు చూసినా సరిపోలటం లేదు. విద్యుత్తు డిమాండ్, సరఫరా కోసం ప్రణాళికలు ఒక్కోసారి తారామారు అవుతున్నాయి. విచ్చలవిడిగా వాడటం వల్ల గందరగోళంగా ఉంటోంది. ఉపకేంద్రాలు, నియంత్రికల వద్ద వినియోగం గణాంకాలు నమోదు అవుతున్నాయి. మీటర్ల ద్వారా నమోదు అవుతున్న యూనిట్లకు పొంతన కుదరడం లేదు. సరఫరా నుంచి పక్కకు ఎటు వెళ్తోందో, ఎలా పోతోందో అంతుపట్టక విద్యుత్తు శాఖ అధికారులు లెక్కలను తేల్చటానికి తలమునకలవుతున్నారు. చౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్, అధికారులు దాడులు చేస్తున్నారు. కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. జిల్లాలో అక్రమ వినియోగం పెరిగిందని బహిరంగంగానే అధికారులకు తెలుస్తుండటంతో చౌర్యం నష్టాన్ని పూడ్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్తు వినియోగంపై డేగ కన్ను వేశారు. 2022 జనవరి నుంచి జులై వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1348 చౌర్యం కేసులు నమోదయ్యాయి. మీటర్ల వద్ద రీడింగ్, కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం, మీటరు ట్యాంపరింగ్, స్థానికంగా కొందరు సిబ్బంది సాయంతో అక్రమ కనెక్షన్ల ద్వారా విద్యుత్తు చోరీ జరుగుతోందని తనిఖీల్లో వెల్లడైంది. తనిఖీల నిర్వహణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. కనెక్షన్లు పెరుగుతున్నా దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం జరగడం లేదు. మీటరుతో సంబంధం లేకుండా కొందరు స్తంభం తీగల నుంచి నేరుగా వాడుకుంటున్నారు. తీగలు సరిచేయడం, నియంత్రికల వద్ద పరిష్కారాలు, బిల్లుల వసూలుకు సిబ్బంది సరిపోతున్నారు. అక్రమ కనెక్షన్లపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తోంది. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే వాటర్ ప్లాంట్లు, ధాబాలు, చిన్నతరహా పరిశ్రమలు పెట్టుకొని వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తును వాడుకుంటున్నారు. ఇది ఉచితం కిందనే జమకడుతున్నారు. ఈ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
నెలలో మూడు రోజుల పాటు తనిఖీలు : - ప్రభాకర్, ఎస్ఈ, సిద్దిపేట జిల్లా
వినియోగదారులు సక్రమంగా విద్యుత్తు వినియోగించుకోవాలి. అక్రమ వినియోగదారులు పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నాం. జరిమానా విధిస్తున్నాం. రెండోసారి దొరికితే జైలుకు పంపిస్తున్నాం. చౌర్యం నివారణకు ప్రతి నెలలో జల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు డివిజన్కు ఒక రోజు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.