పల్లెకు పచ్చలహారం
పచ్చందాల పెంపునకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వచ్చే ఏడాది నిర్వహించే తొమ్మిదో విడతకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది.
తొమ్మిదో విడతకు సన్నద్ధం
న్యాల్కల్ మండలం గంగ్వార్లో మట్టి సేకరణలో కూలీలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్: పచ్చందాల పెంపునకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వచ్చే ఏడాది నిర్వహించే తొమ్మిదో విడతకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. డిసెంబరు 15 నాటికి మట్టి, విత్తనాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
జిల్లాలో 647 పంచాయతీలున్నాయి. ఇందులో 639 గ్రామాల్లో ఉపాధి పథకంలో నర్సరీల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి చుట్టూ కంచె సిద్ధం చేస్తున్నారు. ప్రతి నర్సరీలో పదివేల మొక్కలు నాటించనున్నారు. రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో నాటేందుకు ఎన్ని అవసరం అవుతాయని గ్రామసభల ద్వారా నమోదు చేసుకుంటున్నారు. అదే విధంగా ఇంటింటికీ పంపిణీ చేసే పూలు, పండ్లవి ఎన్ని కావాలని తెలుసుకుని, పెంచేందుకు ఏపీవో, ఎఫ్ఏ, ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో నర్సరీలో రూ.1.68లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం రూ.10 కోట్లు నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు.
మహిళా సంఘాలకు అప్పగించేలా..
గతంలో ఎన్నడూ లేని విధంగా క్లస్టర్ లెవల్ ఫెడరేషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మండలంలో రెండు వన నర్సరీల బాధ్యతను మహిళ సంఘాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం వన సేవకుల నియామకానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపడుతోంది. తొలి విడతలో విజయవంతంగా వారు సాధిస్తే భవిష్యత్తులో దశల వారీగా పూర్తిగా వారికే అప్పగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రత్యామ్నాయంగా..: ప్రతి ఏటా నాణ్యతలేని విత్తనాలు నాటడం వల్ల మొక్కలు మొలకెత్తడం లేదు. దీంతో ఆగస్టు, సెప్టెంబరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సారి దానిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో బెడ్ వేసుకుని పెంచేలా చూడాలని నర్సరీల నిర్వాహకులను జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నర్సరీలో 100 శాతం బతికించేలా వారిదే బాధ్యతని అధికారులు పేర్కొంటున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ అధికారి, సంగారెడ్డి
వన నర్సరీల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తిస్తున్నాం. మట్టి సేకరణ, బ్యాగుల రవాణా, మట్టి నింపడం వంటివి చేస్తున్నాం. మొక్కల పెంపకంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, క్షేత్రసహాయకులదే పూర్తి బాధ్యత. ఉపాధి నిధులు సిద్ధంగా ఉన్నాయి. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!