పరికరాలు లేకుండా ప్రయోగాలెలా..?
ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తుకు ఇంటర్ నుంచే బీజం పడుతుంది. సైన్స్ గ్రూపులు, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ తరగతులు తప్పనిసరి.
నామమాత్రపు తరగతులతో ఫలితం శూన్యం
న్యూస్టుడే, మెదక్ టౌన్, నర్సాపూర్, చేగుంట
ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తుకు ఇంటర్ నుంచే బీజం పడుతుంది. సైన్స్ గ్రూపులు, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ తరగతులు తప్పనిసరి. మొదటి నుంచి సాధన చేస్తేనే మంచి ఫలితాలుంటాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో సదుపాయాలు లేకపోవడంతో ప్రయోగ తరగతులు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. అవసరమైన రసాయనాలు, ఇతర పరికరాల కొరతతో ఇక్కట్లు తప్పడంలేదు. చాలాచోట్ల హడావిడిగా కొన్ని కళాశాలలను ప్రారంభించిన ప్రభుత్వం ప్రయోగశాలల సదుపాయాలను కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో తీరుపై పరిశీలనాత్మక కథనం..
మెదక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో..
పక్కా భవనాలున్నా..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, 14 చోట్ల పక్కా భవనాలు ఉన్నాయి. శివ్వంపేట, నార్సింగి మండలాల్లో 10 ఏళ్ల క్రితం ఏర్పాటైనా సొంత భవనాలు లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. అటు పాఠశాల, ఇటు కళాశాల విద్యార్థులకు సరిపడా గదులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు, పరికరాలు లేకపోవడంతో ఆయా అంశాల్లో వెనుకబడుతున్నారు.
రూ. 3కోట్లతో నిర్మించినా..
మెదక్ పట్టణంలో నాలుగు ఏళ్ల క్రితం రూ.3 కోట్లతో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ విద్యార్థినులు 600 మంది ఉన్నారు. వారి సంఖ్యకు తగినట్లు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో ప్రయోగశాలలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రయోగశాలలోని పరికరాలను తొలగించడంతో ప్రయోగాలు చేసేందుకు అవకాశం లేకపోయింది.
నర్సాపూర్లో బీరువాలో పరికరాలు
ప్రత్యేక గదులు కరవు..
జిల్లాలో పక్కా భవనాలున్న కళాశాలల్లోనూ పరికరాలు, రసాయనాలు అందుబాటులో లేవు. దీంతో ప్రయోగ తరగతులు పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలతో పోల్చుకుంటే మెరుగ్గా రాణించలేకపోతున్నారు. ఫలితంగా ఉత్తీర్ణత శాతం సైతం తగ్గుతుంది. కొన్నిచోట్ల ప్రత్యేక గదులు లేకపోవడంతో ప్రయోగ పరికరాలు మూలకు, బీరువాల్లో ఉంటున్నాయి. ద్వితీయ సంవత్సరం, ఒకేషనల్ విద్యార్థులకు బోధన తరగతులు పూర్తయిన ప్రయోగాలు చేయించలేకపోతున్నారు.
నిధులు విడుదల కావడం లేదు...
- సత్యనారాయణ, ఇంటర్ జిల్లా నోడల్ అధికారి
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అన్నింటిలో ప్రయోగశాలలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. గతంలో ఉన్న ప్రయోగ పరికరాలు సరిపోవడం లేదు. గతేడాది ప్రయోగశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య పరంగా రూ.4-5 వేలు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. కాగా ఈ యేడు ఇంతవరకు విడుదల కాకపోవడంతో నూతన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు