బడికి దూరంగా బాల్యం
బడీడు పిల్లలు ఆడుతూ.. పాడుతూ అక్షరాలు నేర్వాలి. తరగతి గదిలో అక్షరాలు దిద్ది ఉత్తమ పౌరులుగా ఎదగాలి.
జిల్లాలో 121 మంది గుర్తింపు
సర్వే చేస్తున్న సీఆర్పీ
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: బడీడు పిల్లలు ఆడుతూ.. పాడుతూ అక్షరాలు నేర్వాలి. తరగతి గదిలో అక్షరాలు దిద్ది ఉత్తమ పౌరులుగా ఎదగాలి. నేటికీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ కారణాలతో పాఠశాలకు దూరంగా ఉంటూ పనిలో మగ్గిపోతున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జనవరి 6 నుంచి 31వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో పని చేసే క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేకంగా బడి బయటి పిల్లల సర్వే నిర్వహించారు. జిల్లాలో 121 మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. వీరికి ప్రత్యేక బోధన ఇప్పించి, వయస్సు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా తరగతిలో చేర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
వలస కూలీలే అధికం
జిల్లాలో బడికి దూరంగా ఉంటున్న పిల్లల వివరాలను సమగ్ర శిక్ష అధికారులు సేకరించారు. సీఆర్పీలు వారి పరిధిలోని కాలనీలు, గ్రామాలు, తండాలలో పర్యటించి.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇటుక బట్టీలు, వివిధ పరిశ్రమల్లో పని చేసే వారి పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎందుకు బడికి పంపడం లేదో పూర్తి వివరాలు సేకరించి ఫొటోలతో అంతర్జాలంలో అప్లోడ్ చేశారు.
ప్రత్యేక బోధనతోనే ఫలితం
గుర్తించిన బడి బయటి పిల్లలకు ప్రత్యేక బోధన చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు నెలల పాటు ప్రత్యేక పుస్తకాల ద్వారా బోధిస్తారు. అనంతరం జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో సమీపంలోని ప్రభుత్వ బడిలో లేదంటే.. కస్తూర్బా పాఠశాలలో చేర్పిస్తారు. వీరు పాఠశాలల్లో చేరిన తరువాత రెగ్యులర్గా వెళ్తున్నారా.. లేకపోతే మళ్లీ పనుల్లోకి వెళ్తున్నారా సీఆర్పీలు ప్రత్యేక పరిశీలన చేస్తారు. రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా చదివేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. బడి బయటి పిల్లలు లేని సమాజం తయారు చేయాలన్నదే లక్ష్యమని ఏఎంవో అనురాధ తెలిపారు. వీరికి ప్రత్యేకంగా బోధించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.