పద్దుపై ఆశ..ప్రగతి శ్వాస!
సాగునీటి పథకాలకు నిధులు పారాలి.. సంక్షేమ సరాగం వినిపించాలి.. పర్యాటక ప్రగతి కనిపించాలి.. అన్నదాత మోమున నవ్వులు వికసించాలి.. ఆరోగ్యం మరింత పదిలమవ్వాలి.. ప్రభుత్వ పథకాలకు జిల్లా వాటా పెంచాలి.. విద్య ఉన్నతికి మరిన్ని ఉషస్సులు దరి చేరాలి.. ఇవీ ప్రజల ఆకాంక్షలు.
న్యూస్టుడే, మెదక్, నర్సాపూర్: సాగునీటి పథకాలకు నిధులు పారాలి.. సంక్షేమ సరాగం వినిపించాలి.. పర్యాటక ప్రగతి కనిపించాలి.. అన్నదాత మోమున నవ్వులు వికసించాలి.. ఆరోగ్యం మరింత పదిలమవ్వాలి.. ప్రభుత్వ పథకాలకు జిల్లా వాటా పెంచాలి.. విద్య ఉన్నతికి మరిన్ని ఉషస్సులు దరి చేరాలి.. ఇవీ ప్రజల ఆకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనున్న ఆర్థిక పద్దులో నిధులు వడ్డిస్తారని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.
సొంతింటి కల
పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. జిల్లాలో 4,790 మందికి గృహాలు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం. ఇప్పటివరకు 2,422 మాత్రమే పూర్తి చేశారు. మరో వేయింటికి టెండర్లు నిర్వహించినా స్పందన లేదు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం ఏ దిశగా అడుగులు పడనున్నాయన్నది వేచి చూడాల్సిందే.
పావలా వడ్డీ
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా నిలిచే పొదుపు విషయంలో జిల్లాకు తోడ్పాటు అనివార్యం. జిల్లాలోని 13,038 సంఘాలు తీసుకున్న రుణాలు, చెల్లిస్తున్న కిస్తీలకు సంబంధించి పావలా వడ్డీ జిల్లాకు గత నాలుగేళ్లకు సంబంధించి రూ.91.20 కోట్లు విడుదలవ్వాల్సి ఉంది. ఈ బడ్జెట్లో మోక్షం లభిస్తే సంఘాల సభ్యులకు సాయం అందుతుంది.
అసంపూర్తిగా మార్కెట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పురపాలికలో సమీకృత మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణానికి రెండేళ్ల కిందట నిధులు కేటాయించింది. జిల్లా కేంద్రం మెదక్లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి గతంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో స్థలం కేటాయించగా, పలువురు హైకోర్టుకు వెళ్లడంతో నీటిపారుదలశాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట స్థలాన్ని ఎంపిక చేశారు. నర్సాపూర్లో రూ.3 కోట్లతో నిర్మాణం చేపట్టగా రెండు నెలల కిందట నిలిచిపోయాయి. తూప్రాన్లో అందుబాటులోకి రాగా రామాయంపేటలో పనులు కొనసాగుతున్నాయి. అన్ని పురపాలికల్లో వైకుంఠధామాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. రామాయంపేటలో మల్లె చెరువు వద్ద స్థలం ఎంపిక చేయగా మొదలుకావాల్సి ఉంది.
శిక్షణతోనే ఉపాధి
జిల్లాలో యువతకు ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తే ఉపాధి లభించనుంది. గతంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ ఇచ్చేవారు. ఉద్యోగ మేళాలు నిర్వహించి అవకాశాలు కల్పించారు. కరోనా రాకతో నిలిచిపోయాయి. ఉపాధి హామీలో 100 రోజుల పని దినాలు పూర్తయిన కుటుంబాల్లోని యువతకు సైతం తర్ఫీదు ఇచ్చేవారు. ప్రస్తుతం అది అటకెక్కింది. కొన్ని నెలల కిందట జిల్లా యువజన, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మెదక్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక బ్యాచ్ పూర్తికాగా, ఇటీవల మరోటి ప్రారంభమైంది. ఇలాంటివి మరిన్ని అవసరం.
ఆరోగ్య సిరి
గ్రామీణ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు శిథిలమైన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల మరమ్మతులు, ఇతర అవసరాలకు రూ.30 కోట్లు అవసరం. 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 159 ఉపకేంద్రాల్లో సమస్యలు తీరేలా సాయం అందాలి. 70 ఉపకేంద్రాలకే సొంత భవనాలున్నాయి. నర్సాపూర్, రామాయంపేట ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కరవయ్యారు. జిల్లా మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటుకు గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాల్సి ఉంది. పాపన్నపేట పీహెచ్సీలో గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉంది.
పర్యాటక శోభకు..
పర్యాటక రంగ వృద్ధికి జిల్లాకు రూ.60 కోట్లు అందాలి. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను కలుపుతూ వలయ ప్రగతి ఏర్పాటు ప్రకటన అటకెక్కింది. జిల్లా సరిహద్దులోని పోచారం అభయారణ్యం వద్ద అతిథిగృహాల నిర్మాణానికి నిధులు అవసరం. ఖిల్లా అభివృద్ధి, చర్చి చెంతన ఆధునికీకరణకు నిధుల కేటాయింపు తప్పనిసరి. పుణ్యక్షేత్రం ఏడుపాయల సన్నిధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మౌలిక సదుపాయాలు
సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి నిధుల కొరత వేధిస్తోంది. కేవలం రూ.30 లక్షల్లోపు పనులు చేపట్టే వాటికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. తొలివిడతలో 313 పాఠశాలలకు 15 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.5 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో సకాలంలో నిధులు రాక పనులు మందకొడిగా సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం