మాతాశిశు సంరక్షణే లక్ష్యం
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ప్రతి గర్భిణి వివరాలు తొలి త్రైమాసికంలోనే నమోదు చేయాలని పాలనాధికారి రాజర్షి షా ఆదేశించారు.
కలెక్టరేట్ పనులను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షి షా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్ తదితరులు
మెదక్, న్యూస్టుడే: మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ప్రతి గర్భిణి వివరాలు తొలి త్రైమాసికంలోనే నమోదు చేయాలని పాలనాధికారి రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేసి గర్భిణుల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు 76 శాతం ఉందని, ఈ నెలాఖరు వరకు 80 శాతానికి పెంచాలని సూచించారు. ఆశా, ఏఎన్ఎం, ఏడబ్ల్యూఐలకు వేచి ఉండే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల 1, 15 తేదీల్లో వీహెచ్ఎన్డీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్సీడీ లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకు 23 పల్లెదవాఖానాలు మంజూరయ్యాయని, వాటికి తహసీల్దార్లతో కలిసి వైద్యాధికారులు 250 గజాల స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.
పకడ్బందీగా కంటి వెలుగు : కంటివెలుగు శిబిరాలను అవసరం మేర ఉదయం గంట ముందు, సాయంత్రం గంట ఆలస్యంగా నిర్వహించాలని పాలనాధికారి సూచించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందించి ట్యాబ్లో చిత్రాన్ని అప్లోడ్ చేయాలన్నారు. పకడ్బందీగా కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు. క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయని చోట ఈనెల 15 లోగా స్థలాలు గుర్తించాలని ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం ఆయన ఔరంగాబాద్ శివారులోని కొత్త సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన రహదారులు, ప్రహరీ నిర్మించాలని అధికారులకు సూచించారు. అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్, జిల్లా వైద్యాధికారి చందునాయక్, జడ్పీ సీఈవో శైలేష్, డీపీవో సాయిబాబా, డీసీహెచ్ పి.చంద్రశేఖర్, జిల్లా అధికారులు విజయలక్ష్మి, కృష్ణమూర్తి, శ్రీనివాస్, జయరాజ్, విజయశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.