ఆ మాస్టారుకు పాఠశాలే లోకం
అద్భుతమైన భవిష్యత్తును పాఠశాలలో తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. వారి ఆదర్శ విధానాలే పలువిధాలుగా ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
నాలుగేళ్లుగా సెలవు పెట్టకుండా విధులు
ఖాజామొహినొద్దీన్ను సన్మానిస్తున్న స్థానికులు
పూడూరు, న్యూస్టుడే: అద్భుతమైన భవిష్యత్తును పాఠశాలలో తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. వారి ఆదర్శ విధానాలే పలువిధాలుగా ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లికలాన్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ ఖాజామొహినొద్దీన్ పని తీరు ఆదర్శంగా నిలుస్తోంది. విధులు చేపట్టినప్పటి నుంచి విద్యార్థులేతన కుటుంబంలా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ సేవలతో మన్ననలు పొందుతున్నారు. మన్నెగూడలో ఆయన కుటుంబం ఉంది. ఉపాధ్యాయుడు ఖాజాది పేద కుటుంబం. తండ్రి యూసూఫ్ పిండి గిర్ని నడిపించి పోషించారు. కుమారుడు ఖాజా 2010లో మేడిపల్లికలాన్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు చేపట్టారు. ఇంటి నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. నాడు పాఠశాలలో 86 మంది విద్యార్థులు ఉండేవారు. గ్రామం నుంచి 60 మంది ప్రైవేటు పాఠశాలకు వెళ్లేవారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అనుమతించటంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రైవేటుకు ధీటుగా బోధన చేపట్టారు. ప్రస్తుతం 131 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 12 మంది గురుకులాలకు ఎంపికయ్యారు. గ్రామం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ప్రైవేటు బడికి వెళ్తున్నారు. ఏ చిన్నారిని కదిలించినా ఆంగ్లంలోనూ ఠక్కున మాట్లాడగలరు. బడిలో ప్రస్తుతం ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గత నాలుగేళ్ల కాలంగా ఖాజా ఒక్క సెలవైనా పెట్టలేదు. సాధారణ, వైద్య సెలవులూ వాడుకోలేదు. నిరంతరంగా బడి నడిచినంతకాలం ఆయన హాజరవుతూనే ఉన్నారు. 2015, 2019 సంవత్సరాల్లో జిల్లా, మండల స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై సన్మానం అందుకున్నారు. మన ఊరు మన బడికి ఇది ఎంపిక కావటంతో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రధానోపాధ్యాయుడి పనితీరు మెచ్చుకుంటూ ఇటీవల గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ చదివి వెళ్లిన విద్యార్థులు భానుప్రకాశ్ ట్రిపుల్ ఐటీలో, విజయలక్ష్మి, చందన ఇంటర్లో ఉత్తమంగా నిలిచారు. తన తండ్రి కష్టపడి చదివించి ఉపాధ్యాయుడిగా చేసినందుకు కృతజ్ఞతగా ప్రత్యేకత చాటడానికి విద్యార్థుల కోసం బడికి వస్తున్నానని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.