పాము కాటుతో బాలుడి మృతి
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు.
గుమ్మడిదల, న్యూస్టుడే: పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. నిద్రిస్తున్న సమయంలో కుమారుడు కిరణ్(14) ఒక్కసారిగా ఏడుస్తూ లేవడంతో తండ్రి రవి, కుటుంబసభ్యులు పాము కాటు వేసిందని గుర్తించారు. వెంటనే సమీపంలోని నర్సాపూర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
మద్యం మత్తులో వెళ్లి.. శవమై కనిపించి
పరిగి గ్రామీణ, న్యూస్టుడే: మద్యం మత్తులో ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. ఎస్సై సంతోష్కుమార్ తెలిపిన ప్రకారం పరిగి పట్టణం శాంతినగర్కు చెందిన బ్యాగరి జంగయ్య(48) కూలీగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రానురాను మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 18వ తేదీన భార్య బంధువుల అంత్యక్రియలకు వేరే గ్రామానికి వెళ్లింది. జంగయ్య బయటికి వెళ్లి, రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం పట్టణ శివారులోని పొలాల్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానంతో జంగయ్య భార్య లక్ష్మిని రప్పించారు. అక్కడ పడిఉన్న దుస్తులు, చెప్పులను చూసిన ఆమె తన భర్తేనని నిర్ధారణకు వచ్చింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
తాండూరు గ్రామీణ, వికారాబాద్: మహిళ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.50వేల జరిమానా విధిస్తు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి కె.సుదర్శన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎస్పీ కోటిరెడ్డి, తాండూరు ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం 2013 ఫిబ్రవరి 20న తాండూరు మండలం కరణ్కోటకు చెందిన వడ్డెశ్యామలమ్మ ఇంట్లో ఉండగా, వరుసకు తమ్ముడైన లింగప్ప వచ్చాడు. ఈ సందర్భంగా 2011లో తన వద్ద తీసుకున్న తులంన్నర బంగారం, రూ.30వేలు ఇవ్వాలని అడిగింది. ఈ సందర్భంగా ఇద్దరికి వాగ్వాదం జరగడంతో, లింగప్ప ఆగ్రహంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలపాలైన శ్యామలమ్మ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై అప్పట్లో ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేయగా, సీఐ ఎన్.శ్రీనివాస్ విచారణ జరిపి నేర నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. పదకొండేళ్లుగా వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం మరోసారి కేసు విచారణకు రాగా న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కేసు దర్యాప్తు చేసిన ఎస్సై, సీఐ, పీపీలు నారాయణ్గౌడ్, రవికుమార్ బృందాన్ని ఎస్పీ అభినందించారు.
పాత నేరస్థుడి అరెస్టు
హైదరాబాద్: అనుమానాస్పదంగా తిరుగుతున్న పాత నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, అతడి వద్ద మూడు ద్విచక్రవాహనాలు లభ్యమయ్యాయి. సరూర్నగర్ ఇన్స్పెక్టరు సైదిరెడ్డి తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన బి.శ్రీనివాస్ (45) కొంతకాలంగా పీఅండ్టీ కాలనీ కోదండరామనగర్లో ఉంటూ మెకానిక్గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి, రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడు. అతడి నుంచి మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు. అతడిపై సరూర్నగర్ ఠాణా పరిధిలో మూడు, జోగిపేట ఠాణా పరిధిలో రెండు కేసులు ఉన్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు