ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం
ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.
వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి
ప్లాస్టరింగ్ పూర్తయిన మొదటి అంతస్తులోని తరగతి గదులు
అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే: ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి. ఎవరూ పట్టించుకోక పోవడంతో అప్పటి నుంచి పనులు చేపట్టలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో తిరిగి ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి. అక్కన్నపేట మండల కేంద్రంలో నడుస్తున్న కేజీబీవీ పాఠశాలకు సొంత భవనం నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ.3.50 కోట్లు మంజూరు చేసింది. భవన నిర్మాణం కోసం స్థానిక పెట్రోల్బంక్కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం 5 ఎకరాలు కేటాయించారు. ఈ స్థలంలో భవన నిర్మాణ పనులకు 2021 సెప్టెంబర్ 17న మంత్రి హరీశ్రావు అప్పటి ఎమ్మెల్యే సతీష్కుమార్తో కల్సి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాన్ని దక్కించుకున్న గుత్తేదారు మొదట్లో పనులను వేగంగా చేపట్టారు. మూడు అంతస్తుల వరకు స్లాబ్ పూర్తి చేశాడు. రెండు అంతస్తుల వరకు లోపల తరగతి గదుల గోడల నిర్మాణం పూర్తి చేశారు. మూడో అంతస్తుకు స్లాబ్ వేసిన తర్వాత బిల్లులు రావడం లేదనే కారణంతో వదిలేశారు. అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ఎవరూ పట్టించుకోక పోవడంతో సుమారు ఏడాది గడుస్తున్నా పనులు తిరిగి ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అర్ధాంతరంగా ఆగిన ఈ పనుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల ద్వారా తెల్సుకున్నారు. గుత్తేదారుతో మాట్లాడి బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి పనులు పూర్తయ్యేలా, బవనం అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. ఈ మేరకు గుత్తేదారు వారం రోజుల క్రితం పనులు తిరిగి ప్రారంభించారు. మొదటి రెండు ఫ్లోర్లలో ప్లాస్టరింగ్ పనులు చురుకుగా జరుగుతున్నాయి.
తీరనున్న అవస్థలు.. ప్రస్తుతం నడుస్తున్న పనుల తీరును చూస్తుంటే వచ్చే విద్యాసంవత్సరం నాటికి పాఠశాల భవనం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ అద్దె భవనంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. సుమారు 155 మంది విద్యార్థులు చదువుతున్నారు. అద్దె భవనంలో వారందరికీ సరిపడే సౌకర్యాలు లేవు. తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయి. డార్మిటరీ, భోజనశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేవు. అయినా ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.