ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై
దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు.
మాట్లాడుతున్న మాజీ గవర్నర్ తమిళిసై
మెదక్, న్యూస్టుడే: దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. భాజపా విశేష్ సంపర్క్ అభియాన్లో భాగంగా శనివారం రాత్రి స్థానిక మాయా గార్డెన్స్లో మేధావుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను మార్చదని స్పష్టం చేశారు. రఘునందన్రావును ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, విశేష్ సంపర్క్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ అమర్నాథ్, లోక్సభ కన్వీనర్ సంగమేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరణిత, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్గౌడ్, నేతలు విజయ్కుమార్, ఎంఎల్ఎన్రెడ్డి, మధు, నాయిని ప్రసాద్, జగదీశ్చంద్ర పాల్గొన్నారు.
పేదలకు అండగా మోదీ పథకాలు
శివ్వంపేట, వెల్దుర్తి: భారాస, కాంగ్రెస్ దోచుకునే పార్టీలని, భాజపా ప్రభుత్వం పేదలకు పథకాలు అందించిందని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శివ్వంపేటలో శనివారం రాత్రి రోడ్షో, కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. నాయకులు మురళీ యాదవ్, రాజేందర్, రఘువీరారెడ్డి, రమణారావు, బచ్చేష్ యాదవ్, మండల అధ్యక్షుడు పెద్దపులి రవి ఉన్నారు. వెల్దుర్తిలోనూ ప్రచారం కొనసాగింది.
మనోహరాబాద్: అయిదు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. మండలంలోని కాళ్లకల్, మండల కేంద్రం మనోహరాబాద్, కూచారంలో శనివారం రోడ్డు షోలు నిర్వహించి కార్నర్ సమావేశంలో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోయారన్నారు. మోదీ పాలనలో ఎక్కడా అలాంటి ఘటనలు జరగలేదన్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అసైన్డ్ భూములు కబ్జా చేశారన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నత్తి మల్లేశ్, చంద్రశేఖర్, జక్కిడి నరేందర్రెడ్డి, సాయిబాబా, నరేందర్చారి, నందన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!