logo

TS News: రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా

Updated : 21 Jul 2021 14:59 IST

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెళ్తున్న బస్సుకు ఫిట్‌నెస్‌ లేకపోవడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్‌ తెలిపారు. అనంతరం వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని