logo

బారులు తీరిన వాహనాలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భోగి పండుగ రోజు వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని పలు కూడళ్ల వద్ద

Published : 15 Jan 2022 03:48 IST


పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భోగి పండుగ రోజు వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని పలు కూడళ్ల వద్ద శుక్రవారం వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ విధానం పూర్తి స్థాయిలో అమలు ఉండటంతో వాహనాల రాకపోకలు సాఫీగా జరిగాయి. టోల్‌ప్లాజా మీదుగా గురువారం ఒక్క రోజే 45,725 వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో 34,026 కార్లు ఉండటం గమనార్హం. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని పోలీసులు, జీఎమ్మార్‌ సంస్థ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని